epaper
Sunday, January 25, 2026
epaper

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి

కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగ‌రాలి
అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టండి
గెలుపే లక్ష్యంగా నాయ‌కులు పనిచేయాలి
కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలి
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

కాకతీయ, కొత్తగూడెం : త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా, ఇల్లెందు, అశ్వరావుపేటల్లో కూడా వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలను గెలుచుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తొలిసారిగా కార్పొరేషన్ హోదాలో జరుగుతున్న కొత్తగూడెం ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. లబ్ధిదారులకు కేంద్రం నుంచి ఏ పథకాలు అందాయో స్పష్టంగా చెప్పాలని అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ పథకాలేనని గుర్తు చేయాలన్నారు.

తెలంగాణను దోచుకున్న రెండు ప్రభుత్వాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే తన వంతు దోపిడీకి పాల్పడుతోందని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత పన్నెండు సంవత్సరాలుగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల సంపదను లూటీ చేయడమే లక్ష్యంగా పనిచేశాయన్నారు. కాంగ్రెస్ విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంక్షోభంలో సింగరేణి

సింగరేణి కాలరీస్ కంపెనీ పూర్తిస్థాయి సంక్షోభంలో కూరుకుపోయిందని, దీనికి కారణం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణికి రావాల్సిన సుమారు యాభై ఒక వేల కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వమూ, ప్రస్తుత ప్రభుత్వమూ ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లించకపోవడం వల్లే సింగరేణి నష్టాల్లో నడుస్తోందని తెలిపారు. సింగరేణికి వచ్చే నిధులను ఈ రెండు పార్టీలు ఏటీఎంలా వాడుకున్నాయని అసహనం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేసి వెళ్లిందన్నారు. సింగరేణిలో కొత్త యంత్రాల కొనుగోలు, భద్రత చర్యల విషయంలో కూడా ఎలాంటి శ్రద్ధ చూపలేదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను విమర్శించారు.

సింగరేణి అభివృద్ధికి సహకారం

సింగరేణి అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణిని మళ్లీ గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి

అన్ని రంగాల్లో మున్నూరు కాపుల సత్తా చాటాలి మున్నూరుకాపు సంఘం సీనియర్ నాయకులు...

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కొండపల్లి రాఘవరెడ్డిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి :...

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి!

ఉపాధి హక్కుపై కేంద్రం కత్తి! విబిజి రాంజీ చట్టం రద్దు చేయాలి ఖమ్మంలో కాంగ్రెస్...

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి క్వార్టర్లు మాజీ కార్మికులకే కేటాయించాలి కేంద్ర...

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి

యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి హక్కుల సాధనకు రాజకీయ బలం అవసరం మున్సిపల్...

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి

ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20 జాతీయ టోర్నమెంట్...

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

ఐడీఓసీలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఓటు హక్కుపై యువతలో అవగాహనే లక్ష్యం బీఎల్ఓల...

మధిరలో సీఎం కప్ పోటీలు

మధిరలో సీఎం కప్ పోటీలు గ్రామీణ క్లస్టర్లలో ఉత్సాహంగా క్రీడలు ఒలింపిక్ స్థాయి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img