epaper
Sunday, January 25, 2026
epaper

అవినీతికి చెక్ పెట్టేందుకే ‘వీబీజీ–రాంజీ’ చట్టం

అవినీతికి చెక్ పెట్టేందుకే ‘వీబీజీ–రాంజీ’ చట్టం
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం

కాకతీయ, కరీంనగర్ : నూతన వీబీజీ–రాంజీ చట్టంతో కాంగ్రెస్ పాలకుల కమిషన్ల దందాకు కేంద్రం చెక్ పెట్టిందని, అందుకే ఆ పార్టీ నేతలు ఈ చట్టంపై విషప్రచారం చేస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనరసయ్య విమర్శించారు. సిరిసిల్లలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నూతన చట్టంపై నిర్వహించిన కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డిజిటల్ హాజరు, జియో ట్యాగింగ్ విధానాలతో కూలీల సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకే జమ అవుతుండటంతో మధ్యలో నొక్కేయడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. అందుకే కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దివాలాకోరు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. పనిదినాలను 125 రోజులకు పెంచడం, పని కల్పించలేకపోతే నష్టపరిహారం చెల్లించాలనే నిబంధన కూలీలకు వరప్రదానమని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లోనే వీబీజీ–రాంజీ చట్టం గొప్పతనాన్ని కూలీలకు వివరించి, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. మండల, జిల్లా కేంద్రాల్లో వివిధ వర్గాల ప్రజలతో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి శంకర్, మట్ట వెంకటేశ్వర రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి అన్నాడి జలపతి రెడ్డి, మండల అధ్యక్షులు, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ట అవార్డు

కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ట అవార్డు ఎన్నికల నిర్వహణలో కరీంనగర్‌కు రాష్ట్ర స్థాయి...

నిరుపేద కుటుంబానికి సర్పంచ్ భరోసా

నిరుపేద కుటుంబానికి సర్పంచ్ భరోసా కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం నాగారం...

సమ్మక్క జాతరకు 4వేల‌ ఆర్టీసీ బస్సులు

సమ్మక్క జాతరకు 4వేల‌ ఆర్టీసీ బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ క‌రీంన‌గ‌ర్ శ్రీ...

ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్

ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్ కరీంనగర్‌లో ప్రయోగాత్మకంగా కొత్త విధానం ‘మన ఇసుక వాహనం’ యాప్...

ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు

ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతో నిర్ణయం అజ్ఞాత మావోయిస్టులు...

టీఎన్జీవోల సంఘం డైరీ–2026 ఆవిష్కరణ

టీఎన్జీవోల సంఘం డైరీ–2026 ఆవిష్కరణ కాకతీయ, కరీంనగర్: స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్...

బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు

బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు ఎమ్మెల్యే గంగుల సమక్షంలో 200 మంది కండువా క‌ప్పుకున్న...

సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు

సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు కాకతీయ, కరీంనగర్ : సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img