epaper
Sunday, January 25, 2026
epaper

తొర్రూరుపై ఎగిరేది గులాబీ జెండానే!

తొర్రూరుపై ఎగిరేది గులాబీ జెండానే!
16 వార్డులూ మనవే : మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా
కాంగ్రెస్ నుంచి 50 మంది బీఆర్ఎస్‌లో చేరిక

కాకతీయ, తొర్రూరు : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం పట్టణంలోని 8వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లం అర్జున్ రాజు, అల్లం లక్ష్మీ, కొండపల్లి బిక్షపతి, కొండపల్లి వెంకటాచలం, రేబెల్లి లింగమల్లు, నిడిగోండ సుబ్రహ్మణ్యం, లక్ష్మణ్‌తో పాటు మొత్తం 50 మంది ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్తగా చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కేసీఆర్‌ హయాంలోనే తొర్రూరు అభివృద్ధి

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందంజలో ఉందంటే దానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. తొర్రూరు మండలాన్ని మున్సిపాలిటీగా మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసిన మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు. మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గణనీయమైన అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని ఎర్రబెల్లి విమర్శించారు. ఈ విషయం ప్రజలే బహిరంగంగా చర్చించుకుంటున్నారని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న 16 వార్డులలో 16 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, పెద్దవంగర మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వనదేవతలను దర్శించుకున్న సీపీ దంపతులు..

వనదేవతలను దర్శించుకున్న సీపీ దంపతులు.. కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనర్...

ప్రజల రక్షణే లక్ష్యం

ప్రజల రక్షణే లక్ష్యం 24గంట‌లు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ,...

యాభై వేల మాస్కులు అందించిన సీసీఎస్ పోలీసులు

యాభై వేల మాస్కులు అందించిన సీసీఎస్ పోలీసులు కాకతీయ, హనుమకొండ : వచ్చే...

అగ్రంపహాడ్ జాతరపై ప్రభుత్వం నిర్లక్ష్యం

అగ్రంపహాడ్ జాతరపై ప్రభుత్వం నిర్లక్ష్యం భక్తులకు అసౌకర్యంగా మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు పూర్తిస్థాయిలో అమలు...

ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు వరంగల్‌ తూర్పులో సేవా కార్యక్రమాలు పోచమ్మమైదాన్‌ జంక్షన్‌లో...

అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి

అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అభివృద్ధిలో వేగం దేశమంతా తెలంగాణ...

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ! రూ.151 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ రూ.23...

విద్యుత్ షాక్‌తో గేదె మృతి

విద్యుత్ షాక్‌తో గేదె మృతి రూ.ల‌క్ష న‌ష్ట‌పోయామ‌ని బాధితురాలి ఆవేద‌న‌ కాకతీయ, ఏటూరునాగారం :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img