epaper
Friday, March 13, 2026
epaper

ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు

ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు
ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతో నిర్ణయం
అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
రామ‌గుండం సీపీ అంబ‌ర్ కిశోర్ ఝా

కాకతీయ, రామగుండం : నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకిచెందిన ఎనిమిది మంది మావోయిస్టులు శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎదుట లొంగిపోయారు. మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీకి చెందిన సభ్యులు అంబర్ కిశోర్ ఝా సమక్షంలో కమిషనరేట్ కార్యాలయంలో లొంగుబాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపుతున్న ఆదరణ, పునరావాస పథకాల వివరాలు తెలుసుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలనే ఉద్దేశంతో వీరు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే పునరావాస పథకాల కింద అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కార్యకలాపాలు

లొంగిపోయిన ఎనిమిది మంది మావోయిస్టులు మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ వంటి విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. వీరి కార్యకలాపాలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగినట్లు పోలీసులు వెల్లడించారు. ధర్మాజీ శ్రీకాంత్ (జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఇటీక్యాల గ్రామం) 2019 నుంచి మావోయిస్టు పార్టీలో కొరియర్‌గా పనిచేశాడు. 2024లో వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టై జైలు నుంచి విడుదలైన అనంతరం తిరిగి పార్టీలో చేరి సీనియర్ నాయకులకు కొరియర్‌గా వ్యవహరించాడు. పొడియం కాములు మిలీషియా కమాండర్‌గా పనిచేస్తూ స్థానిక సమీకరణలో కీలక పాత్ర పోషించాడు. ముడియం జోగ చైతన్య సాంస్కృతిక విభాగానికి చెందిన నాట్య మండలితో సంబంధం కలిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కుంజం లక్కె పార్టీ సభ్యురాలిగా ఉండి ఆంధ్రి ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుంది. మోదం భీమ, ముడికం సుక్రం, ముడియం మంగు మిలీషియా సభ్యులుగా అడవి కమిటీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కుంజం ఉంగా గూడాచార విభాగం కమాండర్‌గా సమాచారం సేకరణ, లాజిస్టిక్స్ బాధ్యతలు నిర్వహించాడు. లొంగిపోయిన వారిలో శ్రీకాంత్ ఒక్కరే తెలంగాణకు చెందినవాడని, మిగిలినవారు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా గాంగేలూరు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.

అజ్ఞాత మావోయిస్టులకు పిలుపు

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం కమిషనరేట్ పోలీసులు పిలుపునిచ్చారు. గ్రామాలకు తిరిగివచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం పునరావాస పథకాలు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. “పోరు వద్దు – ఊరు ముద్దు” అంటూ అజ్ఞాత మావోయిస్టులు సమాజంలోకి రావాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్‌స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, భీమేష్, ఆర్‌ఐ శేఖర్, ఆర్‌ఎస్‌ఐలు వెంకట్, శివ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మనుషులకే కరెంట్ లేదు..!

మనుషులకే కరెంట్ లేదు..! మ‌హిళా ఏఈ వింత స‌మాధానం.. వివాదాస్ప‌ద‌మైన కాల్ రికార్డు వైర‌ల్ కాకతీయ, సిరిసిల్ల...

బైక్ ఢీకొని గాయపడ్డ వ్యక్తి మృతి

బైక్ ఢీకొని గాయపడ్డ వ్యక్తి మృతి కాకతీయ, కరీంనగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో...

బీఆర్ఎస్‌కు గుడ్‌బై

బీఆర్ఎస్‌కు గుడ్‌బై బీఎస్పీలో చేరిన అంబాల ప్రభాకర్ కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా...

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం, గడ్డివానిపల్లి గ్రామంలో...

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌ కాకతీయ, కరీంనగర్ : సంచార,...

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వం చేపట్టిన...

కాలువలో యువకుడి మృతదేహం…హత్యా? ప్రమాదమా?

కాలువలో యువకుడి మృతదేహం...హత్యా? ప్రమాదమా? తిమ్మాపూర్ మండలంలో అనుమానాస్పద ఘటన కాకతీయ, కరీంనగర్ :...

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాదిలోపు సమస్య పరిష్కారానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img