epaper
Saturday, January 24, 2026
epaper

చొప్పదండిని బీజేపీకి అప్పగించండి

చొప్పదండిని బీజేపీకి అప్పగించండి
అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు
పట్టణాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం :
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని, పట్టణ రూపురేఖలనే మార్చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చొప్పదండి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. పట్టణాలు వెనుకబాటుకు గురవడానికి ఈ రెండు పార్టీల పాలనలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వ 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమే నిర్వహిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వంతోనే పట్టణాల పురోగతి

2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఆ దిశగా అమృత్ పథకాలలో పట్టణాలను చేర్చడంతో పాటు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్మార్ట్ సిటీ హోదా కల్పించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందని, కరీంనగర్ స్మార్ట్ సిటీకి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. పట్టణాల ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేసిన గంగాడి కృష్ణారెడ్డి.. కేంద్ర మంత్రుల సహకారం, కేంద్ర నిధులతో పట్టణాల అభివృద్ధి బాధ్యతను బీజేపీ స్వయంగా తీసుకుంటుందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలపై ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ప్రజలంతా బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్‌పై కూడా కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్

ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్ కరీంనగర్‌లో ప్రయోగాత్మకంగా కొత్త విధానం ‘మన ఇసుక వాహనం’ యాప్...

ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు

ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతో నిర్ణయం అజ్ఞాత మావోయిస్టులు...

టీఎన్జీవోల సంఘం డైరీ–2026 ఆవిష్కరణ

టీఎన్జీవోల సంఘం డైరీ–2026 ఆవిష్కరణ కాకతీయ, కరీంనగర్: స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్...

బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు

బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు ఎమ్మెల్యే గంగుల సమక్షంలో 200 మంది కండువా క‌ప్పుకున్న...

సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు

సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు కాకతీయ, కరీంనగర్ : సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరను...

ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్

ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కాకతీయ, కరీంనగర్ : నేషనల్ రోడ్...

శాతవాహన వ‌ర్సిటీలో ఉద్యోగ మేళా

శాతవాహన వ‌ర్సిటీలో ఉద్యోగ మేళా కాకతీయ, కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో జాతీయ...

రామగుండం న్టీపీసీ పరిధిలో అక్రమ ఇసుక నిల్వలపై తనిఖీ

రామగుండం న్టీపీసీ పరిధిలో అక్రమ ఇసుక నిల్వలపై తనిఖీ కాకతీయ, రామగుండం: న్టీపీసీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img