epaper
Thursday, March 12, 2026
epaper

రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ?

రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ?
అటవీ భూముల్లో పరిశ్రమ ఎలా?
ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారా!!
గిరిజన భూములకు మంగళం పాడే ప్రయత్న‌మా..!?
వైల్డ్ ఫారెస్ట్‌లో అనుమతులు ఎవరు ఇచ్చారు?
ఉద్యోగాల పేరుతో వసూళ్ల పర్వం?
జిల్లా కలెక్టర్ జోక్యం తప్పనిసరంటున్న గిరిజ‌నులు
ప్రత్యక్ష పోరాటానికి గిరిజనులు స‌న్న‌ద్ధం

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని *రేగళ్ల పెద్దతండా*లో టెక్స్టైల్ ఫ్యాక్టరీ స్థాపన పేరుతో జరుగుతున్న వ్యవహారం గిరిజన ప్రాంతంలో కలకలం రేపుతోంది. పూర్తిస్థాయి ఏజెన్సీ గ్రామాలతో, దట్టమైన అటవీ ప్రాంతాలతో చుట్టు ముట్టబడి ఉన్న ఈ గ్రామంలో నూరుశాతం గిరిజనులే నివసిస్తున్నారు. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఈ గ్రామ ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లిన దశలూ ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండానే అటవీ భూముల్లో ఫ్యాక్టరీ స్థాపించేందుకు కొందరు పెద్దలు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారని గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి, వన్యప్రాణ సంరక్షణ భూములు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమ స్థాపన ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అటవీ భూముల్లో పరిశ్రమ ఎలా?

రేగళ్ల పెద్దతండా పంచాయతీ పరిధిలోని మూన్య తండా వద్ద గిరిజనుల సాగులో ఉన్న భూమిని అకస్మాత్తుగా టెక్స్టైల్ ఫ్యాక్టరీ పేరుతో చదును చేయడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో 95 శాతం మేర బంజారా గిరిజనులు అటవీ భూముల్లో సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాల కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కొంతమంది గిరిజనులు తమ భూముల హక్కుల కోసం న్యాయస్థానాల మెట్లు కూడా ఎక్కారు. గతంలో దొరల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు గిరిజనులు పోరాటాలు చేసినా, డబ్బు బలం ముందు ఓడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల మధ్య చిచ్చు

దొరలు ఇతర ప్రాంతాలకు వెళ్లిన తరువాత, గిరిజనుల భూములను అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి పేర్లపై నమోదు చేయకుండా, అదే గ్రామంలో ఉన్న కొంతమంది గిరిజనులను ఉపయోగించి గిరిజనులకు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేగళ్ల పెద్దతండా పరిసర ప్రాంతాల్లో సగానికి సగం అటవీ భూమి ఉంది. కిన్నెరసాని అభయారణ్యం సరిహద్దులో ఉండటంతో వన్యప్రాణ సంరక్షణ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో పరిశ్రమ స్థాపన జరిగితే కాలుష్య ప్రభావంతో గ్రామ జీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు అభివృద్ధి పనులు కూడా అటవీ అనుమతుల లేమితో నిలిచిపోయిన ఈ ప్రాంతంలో, పరిశ్రమలకు ఎలా అనుమతులు వస్తాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇంటికో ఉద్యోగం ఇస్తామని కొందరు బినామీలు ప్రచారం చేస్తూ గిరిజన యువత నుంచి వసూళ్లకు తెరలేపినట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీ పేరుతో అమాయక గిరిజన యువతను మోసం చేస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు.

అనుమతులు లేవు : డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్‌

ఈ వ్యవహారంపై డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్ స్పందించారు. “రేగళ్ల ప్రాంతంలోని అటవీ భూముల్లో ఎవరికీ పట్టాలు లేవు. గతంలో హైకోర్టు కూడా ఈ అంశాన్ని త్రోసిపుచ్చింది. అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు, ఎన్ఓసీలు ఇవ్వలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఫ్యాక్టరీ స్థాపన అసాధ్యం” అని తెలిపారు. ఫ్యాక్టరీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాలను ఉల్లంఘించి ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, ఫ్యాక్టరీ పేరుతో జరుగుతున్న వసూళ్లను ఆపాలని, గిరిజన భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారం గిరిజనుల అభివృద్ధికా? దోపిడీకా? అనే ప్రశ్నలను బలంగా లేవనెత్తుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..! దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు ఎకరానికి 25...

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు కాకతీయ, కూసుమంచి:...

చిన్నారులకు పాదరక్షల పంపిణీ

చిన్నారులకు పాదరక్షల పంపిణీ కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత కాకతీయ...

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ మంత్రుల చొరవతో వెలుగుమ‌ట్ల‌...

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి కూసుమంచి మండలంలో అమానుష ఘటన ఫోక్సో చట్టం కింద...

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..!

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..! భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు వెలుగుమట్ల భూదాన్...

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

ఇక ఉపేక్షించేది లేదు

ఇక ఉపేక్షించేది లేదు కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియ‌స్‌ పున‌రావృతం కాకుండా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img