epaper
Friday, January 23, 2026
epaper

ఒక్కసారిగా పడిపోయిన మిర్చి ధర

ఒక్కసారిగా పడిపోయిన మిర్చి ధర
ఖమ్మం మార్కెట్లో రైతుల ఆందోళ‌న‌
ఖరీదుదారుల మోసంపై రైతుల ఆగ్రహం
మార్కెట్ కార్యాలయం ముట్టడి.. ఉద్రిక్తత
చైర్మన్ హామీతో ఆందోళన విరమణ

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు అకస్మాత్తుగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఖరీదుదారులు ఉద్దేశపూర్వకంగా ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తూ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నా చేపట్టారు. శుక్రవారం మార్కెట్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల వాదన ప్రకారం, ఏసీ మిర్చి ధర రూ.20,100 వరకు పెరిగినప్పటికీ ఖరీదుదారులు మాత్రం రూ.13 వేల నుంచి రూ.15 వేల మధ్యే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మార్కెట్ అధికారులను నిలదీయగా, వారి వివరణకు రైతులు సంతృప్తి చెందలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఖరీదుదారులపై తీవ్ర ఆరోపణలు
రాష్ట్రంలో ఎక్కడలేని ధర ఖమ్మం మార్కెట్లో ఉంటుందనే ఆశతో పండించిన మిర్చిని తీసుకొస్తే, ఖరీదుదారులు తమ ఆశలపై నీళ్లు చల్లుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు కృత్రిమంగా తగ్గిస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. సుమారు రెండు గంటల పాటు కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ కార్యకలాపాలు స్థంభించాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ యర్రగర్ల హనుమంతరావు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అనంతరం ఖరీదుదారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని వారికి హితవు పలికారు. జెండా పాట నిబంధనల ప్రకారమే మిర్చి కొనుగోలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఖరీదుదారులు రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ స్పష్టం చేశారు. ఆయన హామీతో రైతులు ఆందోళన విరమించగా, మార్కెట్‌లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆస్పత్రి కార్మికుల సమస్యలపై కవితకు వినతిపత్రం

ఆస్పత్రి కార్మికుల సమస్యలపై కవితకు వినతిపత్రం 17 వేల మంది కార్మికులను ఐఎఫ్ఎంఎస్‌లో...

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవం కాకతీయ,ఖమ్మం...

సమ్మక్క–సారక్క జాతరకు ఘనంగా శ్రీకారం

సమ్మక్క–సారక్క జాతరకు ఘనంగా శ్రీకారం మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఆలయ కమిటీ...

కూసుమంచిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

కూసుమంచిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు.. కాకతీయ , కూసుమంచి : తెలుగుదేశం...

పౌరులుగా బాధ్యతలు నిర్వర్తించాలి

పౌరులుగా బాధ్యతలు నిర్వర్తించాలి ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ అనుదీప్‌ ‘నా భారతదేశం–నా ఓటు’ థీమ్‌తో ఓటరు...

అడుగుపెడితే అరెస్టులే!

అడుగుపెడితే అరెస్టులే! రేగళ్ల క్రాస్ రోడ్డులో సాతి భవాని జాతరకు అనుమతి లేదు రిజర్వ్...

శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం

శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం శతాబ్ది ముగింపు సభతో శ్రేణుల్లో కొత్త...

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం బైక్ అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టిన ఘటన ఇద్దరు యువకులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img