epaper
Tuesday, March 10, 2026
epaper

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ఇప్పటివరకు 3,836 కార్యక్రమాల నిర్వహణ
డీజీపీ శివధర్ రెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్నాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సెలవు రోజులు మినహాయించి దాదాపు పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతను సామూహిక ఉద్యమంగా మార్చడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
ఈ అవగాహన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నెల 20న నిర్మల్ జిల్లాలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాల సంఖ్య 3,836కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి పౌరుడిలో రోడ్డు భద్రత పట్ల బాధ్యతాభావం పెంపొందించడం, ప్రమాదాలకు దారితీసే నిర్లక్ష్యపు ప్రవర్తనను తగ్గించడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని బలోపేతం చేయడం ఈ ప్రచార కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేస్తూ సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ వినియోగం, సీటుబెల్ట్ ధరించడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం నివారణ, మద్యం సేవించి డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటో ఓవర్‌లోడింగ్, హైబీమ్ లైట్ల దుర్వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.

గ్రామం నుంచి జిల్లా వరకు సమన్వయం
జిల్లా స్థాయిలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. డివిజన్ స్థాయిలో ఎస్డీపీఓలు, మండల స్థాయిలో సీఐలు, ఎస్సైలు, గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ ట్రాఫిక్ సేఫ్టీ కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎన్‌సీసీ ప్రతినిధులు, యువత, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ యజమానులు తదితరులను ఉద్యమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. గ్రామ సభలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, మత సంస్థలు, స్వయం సహాయక సంఘాలతో కలిసి విస్తృత ప్రచారం కొనసాగుతోంది. ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి, తెలంగాణను దేశానికి ఆదర్శ రోడ్డు భద్రతా రాష్ట్రంగా నిలబెట్టే దిశగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు సిద్ధం ఎమ్మెల్యేలు,...

ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు

ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం సుప్రీంకోర్టు నుంచి మాజీ...

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

సివిల్స్‌లో మెరిసిన యువత..!

సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల...

గణపతి లొంగుబాటు..!

గణపతి లొంగుబాటు..! అజ్ఞాత జీవితం వీడిన మావోయిస్టు అగ్రనేత నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు...

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు కోర్టు కేసులున్నా నిర్మాణాలు ప్రగతినగర్...

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు కుటుంబ...

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ గాంధీ కుటుంబానికి సంబంధించిన పెయిటింగ్‌ను జ్ఞాపిక‌గా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img