epaper
Friday, January 23, 2026
epaper

మహిళలే మహారాణులు

మహిళలే మహారాణులు
కోటి మంది మ‌హిళ‌లు కోటీశ్వరులే లక్ష్యం
మహిళల అభ్యున్నతికి రూ.40 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
మరో రెండేళ్లలో అదనంగా రూ.60 వేల కోట్లు
గత ప్రభుత్వ వైఫల్యంతో మహిళలకు ఆర్థికంగా నష్టం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
పాలకుర్తిలో ఇందిరా మహిళా శక్తి ఫంక్షన్ హాల్ ప్రారంభం

కాకతీయ, రాయపర్తి/ పాలకుర్తి : మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో మహారాణుల్లా వెలగాలన్నదే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ధర్మకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆర్థిక శక్తిగా మ‌హిళ‌లు ఎద‌గాలి..!

అనంతరం మండల కేంద్రంలో ఆర్డీఓ పీడీ వసంతలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూ.47 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరా మహిళా శక్తి ఎస్‌ఎల్‌ఎన్ ఫంక్షన్ హాల్ భోజనశాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న సంకల్పంతో మహిళలకు రూ.40 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మరో రూ.60 వేల కోట్లు అందిస్తామని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ విధానమని ఆమె అన్నారు.

గత ప్రభుత్వ వైఫల్యంపై విమర్శ

గత ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.3,500 కోట్ల రుణాలను అందించకపోవడంతో మహిళలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆమె కొనియాడారు. ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరునే మంజూరు చేస్తున్నామని, మేడారం జాతరలో వ్యాపారం నిర్వహించేందుకు మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళ స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందించి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. మహిళల అభ్యున్నతికి పాలకుర్తిలో ఇందిరా మహిళా శక్తి ఎస్‌ఎల్‌ఎన్ ఫంక్షన్ హాల్ భోజనశాల ఏర్పాటు కావడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపిడీవో, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, మహిళా సంఘాల నేతలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జర్నలిస్ట్ కుటుంబానికి 60 వేల ఆర్థికసహాయం

జర్నలిస్ట్ కుటుంబానికి 60 వేల ఆర్థికసహాయం కాకతీయ, నెల్లికుదురు : టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్...

వచ్చే సారికి చూద్దాం..!

వచ్చే సారికి చూద్దాం..! ఈ సీజన్ కు తాత్కాలికంగా వసతులు చేపట్టండి ముసలమ్మకుంట...

జంపన్నవాగులో మునిగిన ముగ్గురికి పునర్జన్మ

జంపన్నవాగులో మునిగిన ముగ్గురికి పునర్జన్మ మునిగిపోతున్న ముగ్గురిని ర‌క్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాకతీయ, ములుగు...

ఆ క‌థ‌నం అస‌త్యం

ఆ క‌థ‌నం అస‌త్యం కొమ్మాల ఆల‌యంలో అవకతవకల్లేవు నిబంధనల ప్రకారమే వేతనాలు, ఖర్చులు ఓ ప‌త్రిక‌లో...

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ప్రభుత్వ జూనియర్...

గెలుపు గుర్రాల కోసం వేట‌

గెలుపు గుర్రాల కోసం వేట‌ ప‌ర‌కాల‌లో మునిసిప‌ల్ పోరు మూడు ప్ర‌ధాన పార్టీల‌కు...

ప‌ల్లాకు ప్ర‌తిష్టాత్మ‌కం?

ప‌ల్లాకు ప్ర‌తిష్టాత్మ‌కం? జ‌న‌గామ పుర పోరులో గెలుపెవ‌రిది ? అధికార‌, ప్ర‌తిపక్షాల మ‌ధ్య హోరాహోరీ వ్యూహాల‌కు...

మెట్టుగుట్ట రామాలయం హుండీ ఆదాయం రూ.1.04 లక్షలు

మెట్టుగుట్ట రామాలయం హుండీ ఆదాయం రూ.1.04 లక్షలు కాకతీయ, మ‌డికొండ : దక్షిణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img