epaper
Friday, January 23, 2026
epaper

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’
సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు
ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు
ఆరు మండలాలకు రూ.3.05 కోట్ల చెక్కుల పంపిణీ
న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

కాకతీయ, నర్సంపేట టౌన్ : ప్రజా ప్రభుత్వ పాలనలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి స్పష్టం చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా చేయడమే లక్ష్యంగా ‘కళ్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ క్లబ్‌లో ఆరు మండలాలకు చెందిన 305 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల 5 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మాధవ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వంలో సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తోందని, ఆర్థిక భారమున్నా సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా జాప్యం లేదని తెలిపారు.

ప్రభుత్వం అండగా నిలుస్తుంది
పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఎవరూ దళారులను నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా లబ్ధిదారులకే ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించి కుటుంబాలపై భారం తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమానంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, వివిధ మండలాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వచ్చే సారికి చూద్దాం..!

వచ్చే సారికి చూద్దాం..! ఈ సీజన్ కు తాత్కాలికంగా వసతులు చేపట్టండి ముసలమ్మకుంట...

మహిళలే మహారాణులు

మహిళలే మహారాణులు కోటి మంది మ‌హిళ‌లు కోటీశ్వరులే లక్ష్యం మహిళల అభ్యున్నతికి రూ.40 వేల...

జంపన్నవాగులో మునిగిన ముగ్గురికి పునర్జన్మ

జంపన్నవాగులో మునిగిన ముగ్గురికి పునర్జన్మ మునిగిపోతున్న ముగ్గురిని ర‌క్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాకతీయ, ములుగు...

ఆ క‌థ‌నం అస‌త్యం

ఆ క‌థ‌నం అస‌త్యం కొమ్మాల ఆల‌యంలో అవకతవకల్లేవు నిబంధనల ప్రకారమే వేతనాలు, ఖర్చులు ఓ ప‌త్రిక‌లో...

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ప్రభుత్వ జూనియర్...

గెలుపు గుర్రాల కోసం వేట‌

గెలుపు గుర్రాల కోసం వేట‌ ప‌ర‌కాల‌లో మునిసిప‌ల్ పోరు మూడు ప్ర‌ధాన పార్టీల‌కు...

ప‌ల్లాకు ప్ర‌తిష్టాత్మ‌కం?

ప‌ల్లాకు ప్ర‌తిష్టాత్మ‌కం? జ‌న‌గామ పుర పోరులో గెలుపెవ‌రిది ? అధికార‌, ప్ర‌తిపక్షాల మ‌ధ్య హోరాహోరీ వ్యూహాల‌కు...

మెట్టుగుట్ట రామాలయం హుండీ ఆదాయం రూ.1.04 లక్షలు

మెట్టుగుట్ట రామాలయం హుండీ ఆదాయం రూ.1.04 లక్షలు కాకతీయ, మ‌డికొండ : దక్షిణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img