epaper
Friday, January 23, 2026
epaper

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం
అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన ఘటన
భక్తుడికి గాయాలు… ఆసుపత్రికి తరలింపు
విషయం బయటకు రాకుండా మంత్రాంగం?

కాకతీయ, మేడారం : మేడారంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. జాతర ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ నేమ్‌బోర్డు ఒక్కసారిగా కిందపడటంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక భక్తుడు గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడ భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని జాతరలో చర్చ సాగుతోంది. జంపన్నవాగు నుంచి గద్దెలకు వెళ్లే ప్రధాన రహదారిలోని హరిత వై–జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న భయాందోళన భక్తుల్లో వ్యక్తమవుతోంది. లైటింగ్ నేమ్‌బోర్డు కుప్పకూలిన ఘటనపై అధికారుల మధ్య సమన్వయం లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిన అధికారులు, విషయం బయటకు పోకుండా ఉంచేందుకు తంటాలు పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే వీడియోలు తీయవద్దంటూ మీడియాను కాంట్రాక్టర్లు అభ్యర్థించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతర నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికార యంత్రాంగం మంత్రాంగం నడుపుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

భక్తుడికి గాయాలు… పోలీసుల తీరుపై ఆగ్రహం
ఈ ఘటనలో గాయపడిన ఎడ్ల నర్సయ్య పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైటింగ్ హోర్డింగ్ కుప్పకూలడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. హోర్డింగ్ కింద ఇరుక్కున్న తనను అక్కడే ఉన్న పోలీసులు కాపాడలేదని, తన భార్య ఎంత బ్రతిమలాడినా వారు కనికరం చూపలేదని వాపోయారు. తనను బయటకు తీసేందుకు పోలీసులు కాకుండా, అక్కడున్న సుమారు 20 మంది భక్తులే ముందుకొచ్చారని ఆయన తెలిపారు. ప్రమాద సమయంలో పోలీసులు మానవత్వంతో వ్యవహరించలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు. లైటింగ్ నేమ్‌బోర్డులు ప్రభుత్వానివా? ప్రైవేట్‌వా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అవి ప్రైవేట్‌వైతే భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని, భక్తుల ప్రాణాలకు బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులు భక్తుల భద్రత కోసమే జాతరలో ఉంటారా? లేక కేవలం విధులకు పరిమితమా? అంటూ క్షతగాత్రుడు ప్రశ్నించారు. లైటింగ్ నేమ్‌బోర్డు కుప్పకూలడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప‌ల్లాకు ప్ర‌తిష్టాత్మ‌కం?

ప‌ల్లాకు ప్ర‌తిష్టాత్మ‌కం? జ‌న‌గామ పుర పోరులో గెలుపెవ‌రిది ? అధికార‌, ప్ర‌తిపక్షాల మ‌ధ్య హోరాహోరీ వ్యూహాల‌కు...

మెట్టుగుట్ట రామాలయం హుండీ ఆదాయం రూ.1.04 లక్షలు

మెట్టుగుట్ట రామాలయం హుండీ ఆదాయం రూ.1.04 లక్షలు కాకతీయ, మ‌డికొండ : దక్షిణ...

విద్యార్థులకు నోటు బుక్స్ అందజేత

విద్యార్థులకు నోటు బుక్స్ అందజేత కాకతీయ, పెద్దవంగర :చదువులో ఎంతో చురుకుగా ఉండి...

నేతాజీని యువ‌త స్ఫూర్తిగా తీసుకోవాలి

నేతాజీని యువ‌త స్ఫూర్తిగా తీసుకోవాలి బీజేపీ 62వ డివిజన్ అధ్యక్షుడు మేకల శ్రావణ్...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’ సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు ప్రజా...

రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్

రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్ పాఠశాల సమయంలో చేయొద్ద‌ని డీఈవో చెప్పినా...

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు గుడుంబా త‌యారీకి త‌ర‌లుతున్న బెల్లం జాతర ముసుగులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img