epaper
Thursday, January 22, 2026
epaper

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌

సింగ్భూం అటవీ ప్రాంతంలో కాల్పుల మోత‌

15 మంది మావోయిస్టులు మృతి

మృతుల్లో అగ్ర‌నేత ప‌తిరాం మాంఝీ

ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్‌గా కీల‌క బాధ్య‌త‌లు

అతడిపై ఆరు రాష్ట్రాల్లో కేసులు.. రూ. 5 కోట్ల రివార్డు

అధికారికంగా ధృవీక‌రించని పోలీసులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఝార్ఖండ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ప‌శ్చిమ సింగ్భూం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీక‌ర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కీల‌క నేత‌, సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్ పితిరం మాంఝీ అలియాస్ అనల్ ఉన్నట్లు సమాచారం. అతనిపై ఆరు రాష్ట్రాలలో కేసులు, మొత్తం రూ. 5 కోట్ల రివార్డు కూడా ఉంది. కొన్నేళ్లుగా భద్రతా బలగాలపై దాడులకు ఇతడే పథకం రచిస్తున్నట్లుగా సమాచారం. ఇక సింగ్భూం జిల్లాలో ఇంకా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ఆ ప్రాంతం నుంచి భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ మావోలకు అతి పెద్ద దెబ్బ అని.. ఝార్ఖండ్‌లో నక్సలిజంపై భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయం అని అభివర్ణిస్తున్నారు.

ముంచుకొస్తున్న డెడ్‌లైన్‌

2026 మార్చి నాటికి మావోయిస్టు రహితంగా దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగర్‌ ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ సహా మావోయిస్టుల‌ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెద్దఎత్తున సెర్చింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల వివరాలు, ఆయుధాలు గురించి అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఛ‌త్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం అయితే పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో కూడా కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఆపరేషన్ కగర్‌తో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్ప‌టికే ప‌లు ఎన్‌కౌంట‌ర్ల‌లో ప‌దుల సంఖ్య‌లో అగ్ర‌నేత‌లు హ‌తంకాగా.. పలువురు మావోయిస్టులు ఆయుధాలు వీడి పోలీసులకు ఎదుట లొంగిపోతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కేస‌ముద్రంలో హోరాహోరీ

కేస‌ముద్రంలో హోరాహోరీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్‌ కొత్త‌గా ఏర్ప‌డిన మున్సిపాలిటీ...

కేటీఆర్‌కు నోటీసులు

కేటీఆర్‌కు నోటీసులు రేపు ఉదయం 11 గంటలకు విచారణ ఇప్పటికే హరీశ్​రావును విచారించిన అధికారులు త్వ‌ర‌లోనే...

అక్రమాస్తులు రూ. 100 కోట్లు!

అక్రమాస్తులు రూ. 100 కోట్లు! వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ త‌నిఖీలు మొత్తం ఎనిమిది చోట్ల...

సింగరేణిలో బొగ్గు కుంభకోణం

సింగరేణిలో బొగ్గు కుంభకోణం సీబీఐతో ద‌ర్యాప్తు చేయిస్తే అనేక అక్ర‌మాలు వెలుగులోకి రేవంత్–బామ్మర్ది సృజన్...

నాన్న ప్రోత్సాహమే న‌డిపిస్తోంది : హర్షిత్ రాణా

నాన్న ప్రోత్సాహమే న‌డిపిస్తోంది : హర్షిత్ రాణా కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: టీమిండియా...

ట్రాఫిక్‌కు ‘యువ ఐపీఎస్’ ట్రీట్మెంట్!

ట్రాఫిక్‌కు ‘యువ ఐపీఎస్’ ట్రీట్మెంట్! నగర సమస్యల పరిష్కారానికి సీఎం కొత్త ప్రయోగం గ్రేటర్...

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక...

ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం మున్సిపాలిటీలకు నిధులు వ‌చ్చేలా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img