epaper
Tuesday, March 10, 2026
epaper

మేడారం సక్సెస్‌కు నాలుగు పరీక్షలు

మేడారం సక్సెస్‌కు నాలుగు పరీక్షలు
ట్రాఫిక్–పార్కింగ్‌పై పూర్తి పట్టు
జంపన్న వాగు వద్ద గట్టి భద్రత
రద్దీకి తగ్గట్టు క్యూ లైన్ల నియంత్రణ
పారిశుద్ధ్యమే అసలైన సవాల్

కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ మహా వేడుకను విజయవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్లకు పైగా నిధులు వెచ్చించి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు ముందే గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించడంతో ఈసారి భక్తుల రాక మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త గద్దెలు, ఆధునిక వసతుల నేపథ్యంలో సుమారు మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ భారీ రద్దీ మధ్య జాతర సాఫీగా సాగాలంటే నాలుగు కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి అవసరమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి జాతరకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడిపినా, ఎక్కువ మంది భక్తులు తమ స్వంత వాహనాల్లోనే మేడారానికి చేరుకుంటారు. కొందరు నాలుగు రోజుల పాటు అక్కడే బస చేస్తారు. దీంతో జాతర రోజుల్లో మేడారం వైపు ప్రధాన రహదారులు ఎప్పటికప్పుడు వాహనాల రద్దీతో నిండిపోతాయి. చిన్న సమస్య వచ్చినా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు గంటల తరబడి రోడ్డుపైనే చిక్కుకునే పరిస్థితి గతంలో ఎదురైంది. ఈసారి అలా జరగకుండా వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ, పార్కింగ్ ప్రదేశాలను సక్రమంగా వినియోగిస్తూ ట్రాఫిక్‌ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

జంపన్న వాగు వద్ద అప్రమత్తత తప్పనిసరి

మేడారానికి వచ్చే భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో జాతర రోజుల్లో జంపన్న వాగు ప్రాంతం అత్యంత రద్దీగా మారుతుంది. ఈ సమయంలో ఆభరణాల చోరీలు, చిన్నపిల్లలు తప్పిపోవడం, ఈత రాని వారు నీటిలో దిగడం వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. గతంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలూ నమోదయ్యాయి. అందుకే జంపన్న వాగు వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచి, పోలీసుల గట్టి నిఘా కొనసాగిస్తేనే ప్రమాదాలను అరికట్టవచ్చని స్థానికులు సూచిస్తున్నారు.

క్యూలైన్లు–దర్శనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

మహా జాతర రోజుల్లో భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుంది. ఈ క్యూలైన్లలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఉండటంతో అస్వస్థతకు గురయ్యే పరిస్థితులు తలెత్తుతుంటాయి. రద్దీ పెరిగితే నెట్టిపారేయడం, తొక్కిసలాటకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే అధికారులు క్యూలైన్లపై నిరంతరం పర్యవేక్షణ చేయాలి. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి త్వరిత దర్శనం కల్పిస్తే భక్తులకు ఊరట లభిస్తుంది. అలాగే గద్దెల ప్రాంగణంలో తప్పిపోయిన వారిని వెంటనే గుర్తించి కుటుంబ సభ్యులతో కలిపే ప్రత్యేక బృందాలు పనిచేయాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

పారిశుద్ధ్య నిర్వహణే అసలైన పరీక్ష

నాలుగు రోజుల్లోనే మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకం. చెత్త తొలగింపు సక్రమంగా జరగకపోతే పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. జాతర జరుగుతున్న సమయంలోనే కాకుండా అనంతరం కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం, క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం వంటి చర్యలు తీసుకుంటే భక్తులు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ట్రాఫిక్ నియంత్రణ, జంపన్న వాగుపై నిఘా, క్యూలైన్ల సమర్థ నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ—ఈ నాలుగు అంశాల్లో ఏ ఒక్కటిలో లోటుపాట్లు ఉన్నా మేడారం మహా జాతరపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని జిల్లా వాసులు అంటున్నారు. 200 కోట్లకు పైగా వ్యయంతో నిర్వహిస్తున్న ఈ మహా జాతర విజయవంతం కావాలంటే ఈ నాలుగు అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనని మేధావులు, స్థానికులు సూచిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి..

కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు కాకతీయ,గీసుగొండ:కొమ్మాల గుడి...

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు శంక‌రా నేత్ర వైద్య‌శాల‌, రుద్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో...

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి 12 శాతం వడ్డీని ర‌ద్దు చేయాలి ములుగు...

ఆరోగ్యం కోసమే 5 కే రన్

ఆరోగ్యం కోసమే 5 కే రన్ ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే అభివృద్ధి నగర మేయర్...

విన్నపాలు విడిచి

విన్నపాలు విడిచి పన్నుల వేట! వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ .. పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు ఆఫీస‌ర్ల...

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన బొమ్మినేని కాకతీయ, వరంగల్ : రాజ్యసభకు ఎంపికైన వేం...

బీజేపీతోనే నగరాభివృద్ధి

బీజేపీతోనే నగరాభివృద్ధి వరంగల్ అభివృద్ధిపై కేంద్రం నజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడం...

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిర‌స‌న‌ కాకతీయ, నర్సంపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img