epaper
Thursday, January 22, 2026
epaper

కాంగ్రెస్‌తోనే ఏదులాపురం అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే ఏదులాపురం అభివృద్ధి
కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి పూర్తి గ్యారెంటీ
మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే సంకల్పం
మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి

కాకతీయ, కూసుమంచి : పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుకు సాగుతున్నారని, రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ‘నంబర్ వన్’గా నిలబెట్టేందుకు ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 105 మంది లబ్ధిదారులకు రూ. 32.63 లక్షలు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 73 మందికి రూ. 30.14 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఒక వరంలా మారిందని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు.

అభివృద్ధి బాధ్యత మంత్రిదే
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదులాపురంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తే, ఆ ప్రాంతాన్ని రాష్ట్రం గర్వించేలా అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను మంత్రి పొంగులేటి స్వయంగా తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిలో పాలేరు నియోజకవర్గం రాష్ట్రానికే దిక్సూచి కావాలన్నదే లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అర్థం ఇస్తోందని దయాకర్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతోనే కాకుండా ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించిందని గుర్తుచేశారు. మహిళలను కేవలం ఓటర్లుగా కాకుండా పాలనలో భాగస్వాములుగా చేయాలన్న ఉద్దేశంతోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో చైర్మన్ సీట్లలో మెజారిటీ స్థానాలను మహిళలకు కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్.. రిమాండ్

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్.. రిమాండ్ కాకతీయ, చింతకాని : చోరీ కేసులో...

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం కామర్స్‌ విభాగంలో ఖాళీ పోస్టు జనవరి 23లోపు...

గడ్డిగుట్టలో మినీ మేడారం జాతర

గడ్డిగుట్టలో మినీ మేడారం జాతర ఐదు లక్షలకు పైగా భక్తుల రాక అంచనా ఈ...

మామిడి పండ్ల కవర్లపై 50% రాయితీ

మామిడి పండ్ల కవర్లపై 50% రాయితీ ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ అమలు మామిడి...

మంటల్లో గడ్డివాము..పడగ విప్పిన నాగు!

మంటల్లో గడ్డివాము..పడగ విప్పిన నాగు! సోషల్ మీడియాలో వైరల్ వీడియో కాకతీయ, కల్లూరు :...

ఉద్య‌మ‌కారుల కుటుంబాల‌కు అండ‌గా బీఆర్ఎస్‌

ఉద్య‌మ‌కారుల కుటుంబాల‌కు అండ‌గా బీఆర్ఎస్‌ మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు వైరా–ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటన పలు...

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌ రాములవారి ఆలయానికి రూ.350 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ నాలుగు దశల్లో...

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు కాకతీయ, జూలూరుపాడు: ప్రధాన మంత్రి ఉజ్వల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img