epaper
Wednesday, January 21, 2026
epaper

సీఎం హోదాలో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు

సీఎం హోదాలో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
శాంతి భద్రతలకు ముప్పు : పొన్నం అనిల్ గౌడ్

కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉండి రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి బుధవారం కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఎం పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ జెండా గద్దెలను కూల్చివేయాలని పిలుపునివ్వడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్‌కు చెందినవారా లేక ఇతర పార్టీలకు చెందినవారా అన్నది ఆయనకే తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాష్ట్రానికి దురదృష్టకరమని, రాజకీయ ద్వేషాన్ని రెచ్చగొట్టి అల్లర్లకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మీర్ షౌకత్ ఆలి, నాయకులు ఆరే రవి గౌడ్, మాజీ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు చుక్క శ్రీనివాస్, నగర బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు బొంకూరి మోహన్, సోమిరెడ్డి నరేష్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, దినేష్, అన్వేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హుజూరాబాద్‌లో బీజేపీ సంబరాలు, ర్యాలీ

హుజూరాబాద్‌లో బీజేపీ సంబరాలు, ర్యాలీ కాకతీయ, హుజూరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ...

శాతవాహన ఫార్మసీ విభాగాధిపతిగా డా. క్రాంతిరాజు నియామకం

శాతవాహన ఫార్మసీ విభాగాధిపతిగా డా. క్రాంతిరాజు నియామకం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ధర్మపురి అభివృద్ధికి రూ.229 కోట్లు

ధర్మపురి అభివృద్ధికి రూ.229 కోట్లు విద్య–నీరు–సంక్షేమ రంగాలకు భారీగా నిధులు ఇంటిగ్రేటెడ్ పాఠశాల, డిగ్రీ...

డిఫాల్ట్ మిల్లర్లపై జీవో అస్త్రం!

డిఫాల్ట్ మిల్లర్లపై జీవో అస్త్రం! తేల‌నున్న పెండింగ్ సీఎంఆర్‌ లెక్క‌ 90 రోజుల గ‌డువుతో...

మేయర్ పీఠమే టార్గెట్

మేయర్ పీఠమే టార్గెట్ క‌రీంన‌గ‌ర్‌లో పొలిటిక‌ల్ పీక్‌ మూడు పార్టీల మ‌ధ్య త్రిముఖ పోటీ...

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు ఆశావ‌హుల మ‌ధ్య ఒప్పందం.....

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం సన్నాహాలు క్రిటికల్ కేంద్రాల్లో...

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం కరీంనగర్‌ను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం అభ్యర్థులు దొరకని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img