epaper
Tuesday, January 20, 2026
epaper

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు
నర్సంపేటలో రెండు పార్టీల దోపిడీ ఒప్పందం
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమివ్వాలి
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

కాకతీయ, నర్సంపేట : బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విమర్శలు చేస్తూనే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా అంగీకరిస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎమ్మెల్యే మాధవ రెడ్డి గ్రామగ్రామాన తిరిగి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడుతూ పాలన సాగిస్తారని నిలదీశారు.

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ ఒకే బాట
గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ – ఈ రెండు పార్టీలు నర్సంపేట ప్రజలకు ఏం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ‘కాంగ్రెస్ నేతలు నిలువునా దోచుకుంటున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అని ఆరోపిస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఆ ఆరోపణలు నిజమా కాదా చెప్పకుండా ‘మీరు చేసినప్పుడు ఏమైంది? మా దగ్గర కూడా ఆధారాలున్నాయి’ అంటూ మీడియా ముందు మాట్లాడటం చూస్తే, రెండు పార్టీల మధ్య దోపిడీపై అప్రకటిత ఒప్పందం ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పుడు ఎందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘నువ్వు తినేది బయటికి చెప్పకు, నేను తినేది బయటికి చెప్పను’ అన్న ధోరణితోనే నర్సంపేట ప్రజలకు అన్యాయం జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. అధికార దాహం ఎప్పటికీ తీరదని, ప్రజలను పట్టి పీడిస్తూ తమ కడుపు నింపుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్న బీజేపీ నాయకులను గుర్తించి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి ఈ దోపిడీ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాలని రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహారాములు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్‌తో పాటు పలువురు జిల్లా, మండల, పట్టణ, యువమోర్చా, ఎస్టీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం కమ్యూనిటీ హాళ్లతో అన్ని వర్గాలకు మేలు మినీ ట్యాంక్ బండ్‌తో...

మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ

మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ ఎనిమిది కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం వార్డుల వారీగా అభివృద్ధి...

మైసంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం

మైసంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం కాకతీయ, దుగ్గొండి : గ్రామాభివృద్ధికి ఉపాధి హామీ...

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు కాకతీయ, దుగ్గొండి: మండలంలోని...

జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిష‌న్ డిక్ల‌రేష‌న్‌

జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిష‌న్ డిక్ల‌రేష‌న్‌ వరంగల్ జిల్లా ఉద్యోగుల్లో ఉత్సాహం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి...

పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి

పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ వరంగల్ పరిధిలోని...

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట గట్లకుంటలో రైతులతో నేరుగా చర్చ లైన్లు, మీటర్లు,...

హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీక‌రించండి

హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీక‌రించండి రవాణాశాఖ మంత్రికి కుడా చైర్మ‌న్‌, డీసీసీ అధ్యక్షుడి వినతిపత్రం కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img