epaper
Tuesday, January 20, 2026
epaper

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం
కమ్యూనిటీ హాళ్లతో అన్ని వర్గాలకు మేలు
మినీ ట్యాంక్ బండ్‌తో పెరిగిన‌ పట్టణ సౌందర్యం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు అవసరం
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

కాకతీయ, తొర్రూరు : తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. ఆరు కోట్లు డెబ్బై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ధోబి ఘాట్, స్మశాన వాటిక, మైత్రి భవన్ కమ్యూనిటీ హాల్, పద్మశాలి, స్వామి వివేకానంద, గౌడ సంఘం, నాయి బ్రాహ్మణ, విశ్రాంత ఉద్యోగుల, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను స్థానిక నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆయా వర్గాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

బీఆర్ఎస్‌ శంకుస్థాపనలకే పరిమితం..!

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమై పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులను పూర్తి చేసి చూపించామని అన్నారు. తొర్రూరును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణవాసులకు ఆహ్లాదాన్ని అందించేలా టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. మూడు కోట్లతో పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయితే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు సేదతీరే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే సుందరీకరణ పనులు పూర్తి చేసి తొర్రూరును అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మంచినీటి సమస్యకు పరిష్కారంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా

రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తొర్రూరును తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరో పదిహేను కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్, టీపీసీసీ మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, పోనుగొట్టి సోమేశ్వరరావు, చాపల అనిత బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, నరసయ్య, మహిళా బ్లాక్ అధ్యక్షురాలు పింగిలి ఉష పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు నర్సంపేటలో రెండు పార్టీల దోపిడీ ఒప్పందం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి...

మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ

మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ ఎనిమిది కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం వార్డుల వారీగా అభివృద్ధి...

మైసంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం

మైసంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం కాకతీయ, దుగ్గొండి : గ్రామాభివృద్ధికి ఉపాధి హామీ...

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు కాకతీయ, దుగ్గొండి: మండలంలోని...

జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిష‌న్ డిక్ల‌రేష‌న్‌

జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిష‌న్ డిక్ల‌రేష‌న్‌ వరంగల్ జిల్లా ఉద్యోగుల్లో ఉత్సాహం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి...

పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి

పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ వరంగల్ పరిధిలోని...

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట గట్లకుంటలో రైతులతో నేరుగా చర్చ లైన్లు, మీటర్లు,...

హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీక‌రించండి

హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీక‌రించండి రవాణాశాఖ మంత్రికి కుడా చైర్మ‌న్‌, డీసీసీ అధ్యక్షుడి వినతిపత్రం కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img