epaper
Tuesday, January 20, 2026
epaper

సింగరేణిలో బొగ్గు కుంభకోణం

సింగరేణిలో బొగ్గు కుంభకోణం
సీబీఐతో ద‌ర్యాప్తు చేయిస్తే అనేక అక్ర‌మాలు వెలుగులోకి
రేవంత్–బామ్మర్ది సృజన్ పాత్రపై ఆరోపణలు
టెండర్ నిబంధనల మార్పుతో వేల కోట్ల నష్టం
అంతర్గత విచారణ సరిపోదు… సీబీఐకే అప్పగించాలి
దర్యాప్తు కోరుతూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి హ‌రీష్‌రావు లేఖ‌
సిట్‌కు వెళ్లే ముందే మీడియా సాక్షిగా లేఖ విడుదల

కాకతీయ, తెలంగాణ బ్యూరో : సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్ రావు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి ఈ కుంభకోణానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంటూ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి *జి. కిషన్ రెడ్డి*కి లేఖ రాశారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సాక్షిగా ఆ లేఖను హరీశ్ రావు విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. లేఖలో హరీశ్ రావు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేణిలో టెండర్లకు “సైట్ విజిట్ సర్టిఫికేట్” అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారని తెలిపారు. ఈ విధానం గతంలో సింగరేణిలో ఎప్పుడూ లేదని, దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ వంటి సంస్థల్లో కూడా అమలులో లేదని గుర్తుచేశారు. ఈ నిబంధన ద్వారా ముందుగానే కొందరికి లబ్ధి చేకూర్చేలా టెండర్లు మలచినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు.

తక్కువ ధర టెండర్లు రద్దు… అధిక ధరలకు కట్టబెట్టడం

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైనస్‌ 7 నుంచి మైనస్‌ 20 శాతం వరకు తక్కువ ధరలకు ఖరారైన టెండర్లను రద్దు చేసి, కొత్త విధానంలో ప్లస్‌ 7 నుంచి ప్లస్‌ 10 శాతం వరకు అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. దీని వల్ల సింగరేణికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఈ మార్పులు ప్రజాధనానికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని లేఖలో వివరించారు. డీజిల్ కొనుగోలు విధానంపై కూడా హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఐఓసిఎల్ నుంచి నేరుగా బల్క్ డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని నిలిపివేసి, కాంట్రాక్టర్లకు అప్పగించారని విమర్శించారు. దీంతో ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, అదనంగా జీఎస్టీ భారం పడుతోందని, ఇది సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఎందుకు శాశ్వత సీఎండీ నియామ‌కం జ‌ర‌గలేదు

గత రెండేళ్లుగా సింగరేణికి శాశ్వత సీఎండీని నియమించకపోవడంపై హరీశ్ రావు ప్రశ్నలు లేవనెత్తారు. ఇన్‌చార్జ్ పాలనతో సంస్థ నడుస్తుండటంతో మానిటరింగ్ బలహీనమై, ఇష్టారాజ్య నిర్ణయాలకు దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు నిబంధనల ఉల్లంఘనలపై మౌనంగా ఉండటంపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ లేదా అంతర్గత విచారణలు సరిపోవని, 2024 తర్వాత తీసుకున్న అన్ని టెండర్లు, పాలసీ నిర్ణయాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు వెలుగులోకి వస్తాయని హరీశ్ రావు కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాన్న ప్రోత్సాహమే న‌డిపిస్తోంది : హర్షిత్ రాణా

నాన్న ప్రోత్సాహమే న‌డిపిస్తోంది : హర్షిత్ రాణా కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: టీమిండియా...

ట్రాఫిక్‌కు ‘యువ ఐపీఎస్’ ట్రీట్మెంట్!

ట్రాఫిక్‌కు ‘యువ ఐపీఎస్’ ట్రీట్మెంట్! నగర సమస్యల పరిష్కారానికి సీఎం కొత్త ప్రయోగం గ్రేటర్...

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక...

ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం మున్సిపాలిటీలకు నిధులు వ‌చ్చేలా...

కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట

కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట మూడు మేయ‌ర్ ప‌ద‌వులు, 38 ఛైర్‌పర్సన్...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img