epaper
Sunday, March 8, 2026
epaper

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం
అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు
ఆశావ‌హుల మ‌ధ్య ఒప్పందం.. అంగీకారం
చెన్నూరు క్యాంపు కార్యాల‌యంలో మంత్రి వివేక్‌ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం
సర్వే రిపోర్టుల ఆధారంగానే టికెట్లు కేటాయింపుపై స్ప‌ష్ట‌త‌
టికెట్ల పంచాయితీలకు ‘ఫుల్‌స్టాప్’ పెట్టే ప్ర‌య‌త్నం

కాకతీయ, రామకృష్ణాపూర్ : మ‌ంచ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని క్యాత‌న్ ప‌ల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఒక్కో వార్డులో పోటీ చేస్తున్న ఆశావహుల వివరాలను సేకరించిన కాంగ్రెస్, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి జరిగిన ఆశావహుల సమావేశంలో కీలక మార్గదర్శకాలు జారీ అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వార్డుల వారీగా నిర్వహిస్తున్న సర్వేలే టికెట్ల కేటాయింపుకు ప్రామాణికమని స్పష్టం చేసినట్లు సమాచారం. టికెట్ ఎవరికి వచ్చినా, అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలుపు కోసం శ్రమించాలని ఆయన నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కొనసాగుతున్న టికెట్ల పంచాయతీలకు ఈ నిర్ణయంతో మంత్రి వివేక్ స్పష్టమైన ఫుల్‌స్టాప్ పెట్టినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మంగళవారం చెన్నూరు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నేతలు మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడంతో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ స్పీడ్

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సర్వేలు నిర్వహిస్తూ అభ్యర్థుల బలాబలహీనతలను పరిశీలించి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే 20 వార్డులకు పైగా అభ్యర్థులను ఖరారు చేసి ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎలాగైనా మరోసారి క్యాతన్‌పల్లి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో నేతలు సమన్వయంగా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ పొత్తుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అధికార కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తారా, లేక బీఆర్ఎస్‌తో జతకడతారా అన్నది తేలాల్సి ఉంది. పొత్తులో భాగంగా సీపీఐ ఎనిమిది స్థానాలు కోరగా, కాంగ్రెస్ మూడు స్థానాలకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూడు స్థానాలతో సీపీఐ పొత్తుకు సిద్ధమవుతుందా? లేక బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తుందా? అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. మొత్తానికి క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img