epaper
Tuesday, January 20, 2026
epaper

పసికందును అన్యాయంగా చంపేశారు!

పసికందును అన్యాయంగా చంపేశారు!
డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ బంధువుల ఆరోప‌ణ‌
గణేష్ నర్సింగ్ హోమ్‌లో ఘ‌ట‌న‌
ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉమ్మనీరు మింగ‌డంతో మృతి : డాక్టర్ బాసంతి

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తొలి కాన్పుతో ఆనందంగా ఉన్న ఓ కుటుంబాన్ని విషాదం ముంచెత్తింది. పండంటి మగబిడ్డకు జన్మనిస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకం మిగిల్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. గణేష్ నర్సింగ్ హోమ్ మెటర్నిటీ జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పసికందు చనిపోయిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ రాజు తండాకు చెందిన సుస్మిత–అశోక్ కుమార్లకు ఇది తొలి కాన్పు. గర్భధారణ మొదటి నుంచే సుస్మితను కొత్తగూడెంలోని గణేష్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించి వైద్య చికిత్సలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతిరోజూ పరీక్షలు, స్కానింగ్‌లు చేసి పసికందు ఆరోగ్యం బాగుందని వైద్యురాలు భరోసా ఇచ్చిందని చెప్పారు.

డెలివరీ ఆలస్యం.. విషాదం

డెలివరీ తేదీగా సోమవారం నిర్ణయించడంతో ఉదయం 10 గంటలకే ఆసుపత్రికి వచ్చామని, అయినా సాయంత్రం వరకూ వేచి చూడాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు వాపోయారు. చివరకు డెలివరీ చేసినప్పుడు పుట్టిన ఐదు నిమిషాలకే పసికందు మృతి చెందాడని, ఇది పూర్తిగా డాక్టర్ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. వైద్యరంగంలో అనుభవం ఉన్న డాక్టర్ ఇలాంటి నిర్లక్ష్యం ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఉమ్మనీరు మింగ‌డంతో మృతి : డాక్టర్ బాసంతి

ఈ ఘటనపై గైనకాలజిస్ట్ డాక్టర్ బాసంతి స్పందించారు. సుస్మితను ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశామని, అప్పటికే పసికందు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపారు. పుట్టిన మగశిశువు ఉమ్మనీరు (అమ్నియోటిక్ ఫ్లూయిడ్)తో పాటు మలాన్ని మింగడంతో పేగులకు అడ్డుపడి, ఊపిరితిత్తులు గట్టిగా మారి శ్వాసకోస సమస్యలు తలెత్తాయని చెప్పారు. అదే కారణంగా పసికందు మృతి చెందినట్లు వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణను తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. పసికందు మృతి తర్వాత వైద్యురాలు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చిందని, కావాలనే తమ బిడ్డను చంపేశారంటూ వారు కన్నీరు మున్నీరు అయ్యారు. తొలి కాన్పులోనే గర్భశోకం మిగిలిన ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత

సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత గ్రామపాలనలో నమ్మకమే మూలం ప్రజల గడపకు ప్రభుత్వ...

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత మానవ నిర్లక్ష్యమే ప్రమాదాలకు మూలం ‘అరైవ్ అలైవ్’తో...

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచనలు కాకతీయ, ఖమ్మం...

పేదరిక నిర్మూలనలో మహిళలే కీలకం

పేదరిక నిర్మూలనలో మహిళలే కీలకం వడ్డీ లేని రుణాలతో మహిళా సాధికారత కొత్తగూడెం ఎమ్మెల్యే...

కబరస్తాన్లను శుభ్రం చేయాలి

కబరస్తాన్లను శుభ్రం చేయాలి రంజాన్‌కు ముందే చర్యలు చేపట్టాలి దహ‌న సంస్కారాలకూ వీలుకాని పరిస్థితి...

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి ఖమ్మంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం :...

అందరూ చదవాలి… అందరూ ఎదగాలి!

అందరూ చదవాలి… అందరూ ఎదగాలి! కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్పనా చౌదరి కాకతీయ,...

కార్మిక హక్కులను హరించేస్తున్న మోడీ ప్రభుత్వం

కార్మిక హక్కులను హరించేస్తున్న మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నాలుగు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img