epaper
Sunday, March 8, 2026
epaper

సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత

సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత
గ్రామపాలనలో నమ్మకమే మూలం
ప్రజల గడపకు ప్రభుత్వ పథకాలు చేరాలి
పారదర్శకతతో..సమన్వయంతో సేవలు అందాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కాకతీయ, ఖమ్మం : గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకుని పనిచేస్తేనే ప్రజల నమ్మకం నిలబడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా సర్పంచులు చొరవ చూపాలని సూచించారు. ఖమ్మం నగరంలోని టిటిడిసి సమావేశ మందిరంలో జిల్లాలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులకు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని గ్రామపాలనలో సర్పంచుల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అందించాల్సిన సేవలపై విస్తృత అవగాహన కల్పించారు.

పారిశుధ్యం–వీధిదీపాలపై ప్రత్యేక దృష్టి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజల మన్ననలు పొంది సర్పంచులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయని, అలాంటి పరిస్థితుల్లో గెలుపొందడం మరింత బాధ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. గ్రామ పాలనలో పంచాయతీ సెక్రటరీతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతమైన పరిపాలన అందించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని ప్రధాన అజెండాగా తీసుకోవాలని, ప్రతిరోజూ ఉదయం ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ ప్రజలు బయటకు వచ్చే సమయానికి ఊరంతా పరిశుభ్రంగా కనిపించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. వీధిదీపాల నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కాలనీతో పాటు ప్రధాన కేంద్రాల్లో సరిపడా వీధిలైట్లు ఏర్పాటు చేసి నిర్వహణ చేపట్టాలని తెలిపారు.

పన్నుల వసూలుతో పంచాయతీకి ఆదాయం

గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు నర్సరీలను అభివృద్ధి చేయాలని, ఉన్న చెట్ల సంరక్షణతో పాటు కొత్త మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. పంచాయతీకి ఆదాయం పెరిగేలా పన్నుల వసూలు సమయానికి చేపట్టాలని, తద్వారా పంచాయతీ నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ ట్యాంకులను కాలానుగుణంగా శుభ్రపరిచి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలని, పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు సమయానికి చెల్లించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా కాక ప్రజల సేవకులుగా వ్యవహరిస్తే గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వాలని, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామ పంచాయతీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దీక్షా రైనా, శిక్షణ తరగతుల పర్యవేక్షకురాలు విద్యాలత, సంబంధిత శాఖల అధికారులు, ఖమ్మం జిల్లాలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భూదాన్ భూముల పేరిట మోసం

భూదాన్ భూముల పేరిట మోసం అక్రమ వసూళ్లపై 6 మందిపై కేసు సత్తుపల్లి ఇన్స్పెక్టర్...

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహాయ ఉపకరణాలు, సబ్సిడీల...

సమాజ అభివృద్ధికి మహిళలే బలం

సమాజ అభివృద్ధికి మహిళలే బలం జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా అంతర్జాతీయ మహిళా...

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా కమిటీ సభ్యులమంటూ నిరుపేదల నుంచి రూ.3...

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని నెహ్రూ...

“మహానటి”

"మహానటి" ** ఆమె ఒక గొప్ప నటి… ఎందుకంటే ఆమె నటన ప్రాణాలతో రాసిన నాటకం ఆస్కార్ అవార్డ్స్ ఎన్ని...

సీఐటీయూలో చేరిన యువ కార్మికులు

సీఐటీయూలో చేరిన యువ కార్మికులు కాకతీయ, కొత్తగూడెం : కార్మికుల సమస్యల పరిష్కారం...

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకతీయ, కొత్తగూడెం :జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img