epaper
Monday, January 19, 2026
epaper

సాగునీటి విస్తరణకు మాస్టర్ ప్లాన్

సాగునీటి విస్తరణకు మాస్టర్ ప్లాన్
ఖమ్మం జిల్లాకు కొత్త ఆయకట్టు రూట్‌ మ్యాప్
లక్షా 98 వేల ఎకరాల అద‌న‌పు ఆయ‌క‌ట్టు సాధ‌న‌క ప్ర‌ణాళిక‌లు
వ్యవసాయం–సంక్షేమానికి వేల కోట్ల పెట్టుబడులు
వ్యవసాయ రంగానికి రూ.74,163 కోట్లు ఖర్చు
పేదల సంక్షేమానికి రూ.47,710 కోట్ల వ్యయం
రైతు, మహిళ, పేదలే ప్రభుత్వ ప్రాధాన్యం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కొదుమూరు–వందనం లిఫ్ట్ రెండో దశకు శంకుస్థాపన

కాక‌తీయ‌, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధనకు ప్రజా ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం చింతకాని మండలం వందనం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.35 కోట్ల 75 లక్షలతో 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన కొదుమూరు–వందనం ఎత్తిపోతల పథకం రెండో విడత పనులకు, వందనం గ్రామం ఎస్సీ కాలనీలో రూ.1 కోటి 85 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల పనులకు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి వందనం–పుట్టకోట జెడ్పీ రోడ్డు వరకు రూ.3 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.

గత హామీల అమలు చేస్తున్నాం..

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, చింతకాని మండలానికి చుట్టుపక్కల నాగార్జున సాగర్ నీళ్లు ఉన్నప్పటికీ కొదుమూరు, వందనం రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. రైతుల ఆవేదనను గమనించి 2009లో ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత కొదుమూరు–వందనం లిఫ్ట్ పనులు పూర్తి చేసి, 2013 ప్రాంతంలో 2,500 ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ఈ లిఫ్ట్ ద్వారా ఎండాకాలంలో కూడా నీటి లభ్యత ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరో 2,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కొదుమూరు–వందనం లిఫ్ట్ రెండో దశకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో 2 లక్షల 79 వేల ఎకరాల ఆయకట్టు కల్పించామని, ఇప్పుడు అదనంగా లక్షా 98 వేల ఎకరాల ఆయకట్టు సాధనకు ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ ద్వారా 1 లక్షా 38 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, జవహర్ లిఫ్ట్ పరిధిలో 33,250 ఎకరాలు, రాజీవ్ ఫీడర్ కెనాల్ ద్వారా 23 వేల ఎకరాలు, కొదుమూరు–వందనం లిఫ్ట్ ద్వారా 2,500 ఎకరాలు, మంచుకొండ లిఫ్ట్ ద్వారా 2,412 ఎకరాలకు సాగునీరు అందించే పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

రైతు సంక్షేమమే లక్ష్యం

రైతులకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. గత రెండేళ్లలో వ్యవసాయ రంగంపై రూ.74,163 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత ఫించన్, వడ్డీ లేని రుణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహ జ్యోతి, సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలకు రూ.47,710 కోట్లు వెచ్చించామని తెలిపారు. 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లతో మంజూరు చేసి, లబ్ధిదారులకు ప్రతి వారం బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు 100 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరు చేశామని, మధిరలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. మధిర అసెంబ్లీ పరిధిలో కట్టలేరు, మున్నేరు, వైరా నదుల జలాలు వృథా కాకుండా ఆనకట్టలు నిర్మిస్తున్నామని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ఇందిరమ్మ చీరలను ఇంటింటికీ పంపిణీ చేశామని, 96 లక్షల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, రూ.35 కోట్ల వ్యయంతో కొదుమూరు–వందనం ఎత్తిపోతల పథకం రెండో విడత పనులకు శంకుస్థాపన చేశామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనంగా 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తక్కువ విద్యుత్ ఖర్చుతో గ్రావిటీ ద్వారా నీరు పొలాలకు చేరేలా ప్రాజెక్టును డిజైన్ చేశామని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత

సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత గ్రామపాలనలో నమ్మకమే మూలం ప్రజల గడపకు ప్రభుత్వ...

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత మానవ నిర్లక్ష్యమే ప్రమాదాలకు మూలం ‘అరైవ్ అలైవ్’తో...

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచనలు కాకతీయ, ఖమ్మం...

పేదరిక నిర్మూలనలో మహిళలే కీలకం

పేదరిక నిర్మూలనలో మహిళలే కీలకం వడ్డీ లేని రుణాలతో మహిళా సాధికారత కొత్తగూడెం ఎమ్మెల్యే...

కబరస్తాన్లను శుభ్రం చేయాలి

కబరస్తాన్లను శుభ్రం చేయాలి రంజాన్‌కు ముందే చర్యలు చేపట్టాలి దహ‌న సంస్కారాలకూ వీలుకాని పరిస్థితి...

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి ఖమ్మంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం :...

అందరూ చదవాలి… అందరూ ఎదగాలి!

అందరూ చదవాలి… అందరూ ఎదగాలి! కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్పనా చౌదరి కాకతీయ,...

కార్మిక హక్కులను హరించేస్తున్న మోడీ ప్రభుత్వం

కార్మిక హక్కులను హరించేస్తున్న మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నాలుగు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img