epaper
Sunday, March 8, 2026
epaper

కార్పొరేషన్ ఎన్నికల్లో “కారు” స్పీడ్ పెంచాలి

కార్పొరేషన్ ఎన్నికల్లో “కారు” స్పీడ్ పెంచాలి
కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల వద్దకు చేర్చాలి
పనితనాన్ని బట్టే ప్ర‌జ‌లు ప‌ట్టం కడుతారు
కార్పొరేషన్ ను గెలిపించుకుని కేసీఆర్‌కు కానుక‌గా ఇద్దాం
కార్యకర్తల స‌మావేశంలో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు
క‌లిసి ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చిన ఎంపీ వ‌ద్దిరాజు, మాజీ మంత్రి వనమా

కొత్తగూడెం, కాకతీయ రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ప్రకటించిన 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై ప్రజలను నయవంచన చేసిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ వైఫల్యాలను ‘బాకీ కార్డు’ రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి వార్డులో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఈ బాకీ కార్డును ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను సవాలుగా తీసుకొని సమయాన్ని వృథా చేయకుండా శక్తి వంచన లేకుండా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

కార్పొరేషన్ ఎన్నికలే అసలైన పరీక్ష

కార్పొరేషన్‌లో ‘కారు’ స్పీడును పెంచి కార్పొరేషన్‌ను కైవసం చేసుకొని మాజీ ముఖ్యమంత్రి *కె. చంద్రశేఖర్ రావు*కు కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని నేతలు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు చెందిన సర్పంచులను గెలిపించడంలో కింది స్థాయి క్యాడర్ కష్టపడ్డ తీరు పార్టీపై నమ్మకాన్ని మరింత పెంచిందని అన్నారు. అదే స్ఫూర్తితో కార్పొరేషన్ ఎన్నికల్లో సీనియర్ నాయకులను కలుపుకొని వారి సలహాలు, సూచనలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగి బీఆర్ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఫామ్ ఇచ్చే బాధ్యత పూర్తిగా పార్టీదేనని, ఇందులో ఎవరి వ్యక్తిగత ప్రమేయం ఉండదని నేతలు స్పష్టం చేశారు. ‘నీ–నా’ భేదాలు వదిలి ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి ఉన్న నాయకుడినే అభ్యర్థిగా ఎంపిక చేస్తామని చెప్పారు. బీఫామ్ పొందే వ్యక్తి పనితనం, ప్రజల్లో ఉన్న గుర్తింపే ప్రామాణికమని తెలిపారు. ఇక నుంచి కార్పొరేషన్‌లో ఫోటోలు పంచాయతీలకు తావు ఉండదని తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం ఖాయం

ఇటీవల ఖమ్మంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆయన మాటల తీరును హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బీఆర్ఎస్ దిమ్మలను తొలగించాలని బహిరంగంగా పిలుపునివ్వడం రౌడీయిజాన్ని ప్రోత్సహించడం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం తిరిగి వస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 40 శాతానికి పైగా విజయం లభించిందని, అదే ఉత్సాహంతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్పొరేషన్ డివిజన్ల వారీగా బీఆర్ఎస్ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దాము, సీనియర్ నాయకులు కాంపల్లి కనకేష్, రాజు గౌడ్, మల్లెల రవిచంద్ర, చందు నాయక్, సింధు తపస్వి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత్ సిబ్బందికి సన్మానం

విద్యుత్ సిబ్బందికి సన్మానం కాకతీయ, ములుగు ప్రతినిధి: లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లంపల్లి...

శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ

శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్...

బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ

బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ 16లో 9 వార్డుల్లో బీఆర్‌ఎస్ విజయం 7...

కేసీఆర్‌ను విచారించనున్న సిట్

కేసీఆర్‌ను విచారించనున్న సిట్ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో విచార‌ణ ఆరంభం ఎర్రవల్లి నుంచి...

రైతు ఐడీ తప్పనిసరి!

రైతు ఐడీ తప్పనిసరి! 2026 నుంచి పీఎం కిసాన్ లబ్ధికి షరతు అగ్రిస్టాక్‌తో డిజిటల్...

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి క్యూ లైన్...

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు కాకతీయ, కరీంనగర్...

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం కాకతీయ, గణపురం : మేజర్ గ్రామపంచాయతీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img