epaper
Sunday, January 18, 2026
epaper

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యమే లక్ష్యం

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యమే లక్ష్యం
విద్య–వైద్య రంగాలే ప్రజా ప్రభుత్వానికి పునాది
నర్సింగ్ విద్యార్థులకు విదేశీ అవకాశాల దిశగా అడుగులు
జపనీస్, జర్మన్ భాషల బోధనకు చర్యలు
ఖ‌మ్మం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
ఎదులాపురంలో రూ.108.60కోట్ల‌తో ఇంజనీరింగ్ కళాశాల భ‌వ‌నాల‌కు భూమి పూజ
కూసుమంచిలో రూ.45.50 కోట్ల‌తో 100 పడకల ఆస్ప‌త్రికి శంకుస్థాప‌న
రూ.162.54కోట్ల‌తో మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, మద్దులపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకాటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ–హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘన స్వాగతం పలికారు.

వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతంలో రూ.108 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నూతన భవనాలకు సీఎం భూమి పూజ నిర్వహించారు. కూసుమంచిలో రూ.45 కోట్ల 50 లక్షలతో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి, రూ.162 కోట్ల 54 లక్షలతో మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను, మద్దులపల్లిలో రూ.19 కోట్ల 90 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును సీఎం ప్రారంభించారు.

నర్సింగ్ విద్యార్థులకు విదేశీ అవకాశాలు

నర్సింగ్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, విద్య–వైద్యం ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. పేదలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. వైద్య రంగంలో చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారితీస్తుందని పేర్కొంటూ, నర్సులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు మంచి డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. గతంలో ఇంజనీరింగ్ రంగానికే ఎక్కువ అవకాశాలుండగా, ఇప్పుడు పరిస్థితులు మారి వైద్య రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు.

జపాన్, జర్మనీతో ఒప్పందాలు

జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా పర్యటనల్లో ఆయా దేశాల్లో లక్షల సంఖ్యలో నర్సుల కొరత ఉన్నట్టు గుర్తించామని సీఎం చెప్పారు. జపాన్‌లో ఏజింగ్ సమస్య తీవ్రంగా ఉండటంతో మన నర్సింగ్ విద్యార్థులకు అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకంటే ఎక్కువ జీతభత్యాలు లభించే అవకాశాలున్నాయని తెలిపారు. అందుకే నర్సింగ్ కళాశాలల్లో జపనీస్, జర్మన్ భాషలు నేర్పేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకోసం ఆయా దేశాల ప్రభుత్వాలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. నర్సింగ్ విద్యార్థులు భవిష్యత్తులో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిధులు మంజూరు చేసి నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి చేశామని, విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వసతులు కల్పించామని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, నర్సింగ్ కళాశాలతో పాటు హాస్టల్ భవనాలను ఆధునాతన సాంకేతికతతో నిర్మించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కార్పొరేషన్ చైర్మన్లు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్య హక్కును ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి

విద్య హక్కును ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రితో కాగితాల‌కే...

సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రికార్డు

సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రికార్డు మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి! సాగునీటి–విద్య–వైద్య రంగాల్లో...

గోశాలలకు దాణా పంపిణీ

గోశాలలకు దాణా పంపిణీ చొల్లంగి అమావాస్య సంద‌ర్భంగా స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో...

ముగ్గుల పోటీల బహుమతుల ప్రదానోత్సవం

ముగ్గుల పోటీల బహుమతుల ప్రదానోత్సవం 39వ డివిజన్‌లో ఇమామ్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు మహిళల...

లలితకు నివాళి అర్పించిన కాంగ్రెస్ నేత‌లు

లలితకు నివాళి అర్పించిన కాంగ్రెస్ నేత‌లు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా...

ఖబర్దార్ రాధాకృష్ణ! భట్టి పై వ్యాఖ్యలు మానుకోండి

ఖబర్దార్ రాధాకృష్ణ! భట్టి పై వ్యాఖ్యలు మానుకోండి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఓబీసీ సెల్...

ఎన్టీఆర్‌కు బీఆర్ఎస్ నేతల ఘన నివాళి

ఎన్టీఆర్‌కు బీఆర్ఎస్ నేతల ఘన నివాళి కాకతీయ, జూలూరుపాడు : నందమూరి తారక...

కదం తొక్కిన కామ్రేడ్స్… ఎర్రబారిన ఖమ్మం!

కదం తొక్కిన కామ్రేడ్స్… ఎర్రబారిన ఖమ్మం! ఎటు చూసినా అరుణ పతాకాల రెపరెపలే కిలోమీటర్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img