epaper
Sunday, January 18, 2026
epaper

తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేస్తాం!

తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేస్తాం!
16 వార్డుల్లోనూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం
ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి ఎర్ర‌బెల్లి దిశానిర్దేశం
గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు

కాకతీయ, తొర్రూరు : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ముందే తొర్రూరులో రాజకీయ వేడి పెరిగింది. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దుబ్బతండ సమీపంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారం అండతో నిరుపేదలకు ఇవ్వకుండా కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను రాజకీయ కక్షతో నిలిపివేయడం సరికాదన్నారు.

అభివృద్ధికి కారకుడు కేసీఆర్

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందంజలో ఉందంటే దానికి కారణం మాజీ సీఎం కేసీఆర్ అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. తొర్రూరు మండలాన్ని మున్సిపాలిటీగా మార్చి, అభివృద్ధికి బాటలు వేసిన మహానీయుడు కేసీఆర్‌ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలే బహిరంగంగా చర్చించుకుంటున్నారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

16 వార్డులపై గులాబీ పట్టు

తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 16 వార్డులనూ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గడపగడపకు పార్టీ బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తొర్రూరు పట్టణ మాజీ ఎంపీటీసీ తూర్పాటి సుభద్ర–శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నమిళ్ళ విజయభాస్కర్, జాటోత్ వీరన్న, జాటోత్ వెంకన్నలు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, పెద్దవంగర మండలాలకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే గులాబీ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అభివృద్ధికి అడ్డుగా ఏటూరునాగారం స‌ర్పంచ్‌

అభివృద్ధికి అడ్డుగా ఏటూరునాగారం స‌ర్పంచ్‌ మండల కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు కాకతీయ, ఏటూరునాగారం...

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌!

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌! రైతు–పేదల పాలిట ఆశాజ్యోతి… సంక్షేమ విప్లవ సారథి దేశానికి...

నర్సంపేటలో అవినీతి రాజ్యం!

నర్సంపేటలో అవినీతి రాజ్యం! అధికారం ముసుగులో అక్రమ దందాలు ఎమ్మెల్యే–అధికారులు కుమ్మ‌క్కై ..ప్రభుత్వ పథకాలకూ...

పరకాల పురపోరుకు రంగం సిద్ధం

పరకాల పురపోరుకు రంగం సిద్ధం రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణలు పార్టీలకు సవాల్‌గా మారిన...

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం బ్లాంకెట్లు–స్వెట‌ర్లు ఇవ్వడం లేదు గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం చార్జీలు...

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత అరైవ్‌ అలైవ్‌లో యువతకు...

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట జీరో బిల్లుల లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి లేఖలు విద్యుత్...

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం గౌడ సంఘం నేతలతో మర్యాదపూర్వక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img