epaper
Sunday, January 18, 2026
epaper

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌!

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌!
రైతు–పేదల పాలిట ఆశాజ్యోతి… సంక్షేమ విప్లవ సారథి
దేశానికి తెలుగు జాతి ఘనతను చాటిన మహానాయకుడు
రెండు రూపాయల బియ్యం పథకంతో పేదల గుండెల్లో స్థానం
డ్వాక్రాలు, వృద్ధుల పెన్షన్‌తో సామాజిక మార్పు
ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళి

కాకతీయ, హనుమకొండ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) 30వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సేవలను స్మరించుకుంటూ ఆయనను తెలుగు జాతి గర్వకారణంగా కొనియాడారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ నలుమూలల తెలుగు ప్రజల ఘనతను గర్వంగా చాటిన మహానుభావుడని ఎర్రబెల్లి అన్నారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు.

రైతు–పేదల జీవితాల్లో వెలుగులు

రైతుల కోసం రుణమాఫీ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, నూతన మండలాల వ్యవస్థను ప్రవేశపెట్టి పాలనను ప్రజల దాకా తీసుకెళ్లిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్‌ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన పథకం ఆయనను పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిందని వ్యాఖ్యానించారు.

ఒక వ్యక్తి కాదు… ఒక యుగం

ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక యుగమని, ఒక చైతన్యమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతికి జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చిన నాయకుడిగా, రాష్ట్రాల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎదురు నిలిచిన ధైర్యశాలిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. తాను రాజకీయంగా ఎదగడానికి ఎన్టీఆర్‌ స్ఫూర్తే కారణమని, ఆయనే తన మార్గదర్శకులు, గురువని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ‘‘నేను నమ్మే ముఖ్యమంత్రులు ఇద్దరే… ఒకరు ఎన్టీఆర్‌, మరొకరు కేసీఆర్‌’’ అని పేర్కొంటూ, తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా తారాస్థాయిలో నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేస్తాం!

తొర్రూరుపై గులాబీ జెండా ఎగురవేస్తాం! 16 వార్డుల్లోనూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం ముఖ్య కార్యకర్తల...

అభివృద్ధికి అడ్డుగా ఏటూరునాగారం స‌ర్పంచ్‌

అభివృద్ధికి అడ్డుగా ఏటూరునాగారం స‌ర్పంచ్‌ మండల కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు కాకతీయ, ఏటూరునాగారం...

నర్సంపేటలో అవినీతి రాజ్యం!

నర్సంపేటలో అవినీతి రాజ్యం! అధికారం ముసుగులో అక్రమ దందాలు ఎమ్మెల్యే–అధికారులు కుమ్మ‌క్కై ..ప్రభుత్వ పథకాలకూ...

పరకాల పురపోరుకు రంగం సిద్ధం

పరకాల పురపోరుకు రంగం సిద్ధం రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణలు పార్టీలకు సవాల్‌గా మారిన...

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం బ్లాంకెట్లు–స్వెట‌ర్లు ఇవ్వడం లేదు గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం చార్జీలు...

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత అరైవ్‌ అలైవ్‌లో యువతకు...

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట జీరో బిల్లుల లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి లేఖలు విద్యుత్...

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం గౌడ సంఘం నేతలతో మర్యాదపూర్వక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img