epaper
Thursday, March 5, 2026
epaper

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌!

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌!
రైతు–పేదల పాలిట ఆశాజ్యోతి… సంక్షేమ విప్లవ సారథి
దేశానికి తెలుగు జాతి ఘనతను చాటిన మహానాయకుడు
రెండు రూపాయల బియ్యం పథకంతో పేదల గుండెల్లో స్థానం
డ్వాక్రాలు, వృద్ధుల పెన్షన్‌తో సామాజిక మార్పు
ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళి

కాకతీయ, హనుమకొండ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) 30వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సేవలను స్మరించుకుంటూ ఆయనను తెలుగు జాతి గర్వకారణంగా కొనియాడారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ నలుమూలల తెలుగు ప్రజల ఘనతను గర్వంగా చాటిన మహానుభావుడని ఎర్రబెల్లి అన్నారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు.

రైతు–పేదల జీవితాల్లో వెలుగులు

రైతుల కోసం రుణమాఫీ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, నూతన మండలాల వ్యవస్థను ప్రవేశపెట్టి పాలనను ప్రజల దాకా తీసుకెళ్లిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్‌ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన పథకం ఆయనను పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిందని వ్యాఖ్యానించారు.

ఒక వ్యక్తి కాదు… ఒక యుగం

ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక యుగమని, ఒక చైతన్యమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతికి జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చిన నాయకుడిగా, రాష్ట్రాల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎదురు నిలిచిన ధైర్యశాలిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. తాను రాజకీయంగా ఎదగడానికి ఎన్టీఆర్‌ స్ఫూర్తే కారణమని, ఆయనే తన మార్గదర్శకులు, గురువని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ‘‘నేను నమ్మే ముఖ్యమంత్రులు ఇద్దరే… ఒకరు ఎన్టీఆర్‌, మరొకరు కేసీఆర్‌’’ అని పేర్కొంటూ, తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా తారాస్థాయిలో నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు నాడు ఎడ్ల బండ్లు… నేడు వాహనాల ర‌ద్దీ జిగేల్‌మనే...

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం కాకతీయ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లె...

రోడ్డు పనులు పూర్తి చేయాలి

రోడ్డు పనులు పూర్తి చేయాలి కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ పరిధిలోని కొండ...

పన్నుల చెల్లింపుపై

పన్నుల చెల్లింపుపై వడ్డీ మాఫీ ఉండదు ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను...

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది...

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, ఇనుగుర్తి: కెనాల్ నుంచి బేరు చెరువు...

ఘ‌నంగా హోలీ

ఘ‌నంగా హోలీ కాకతీయ, మరిపెడ: హోలీ వేడుక‌ల‌ను బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో...

ర్యాగింగ్ ఘటనపై

ర్యాగింగ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img