epaper
Thursday, March 5, 2026
epaper

నర్సంపేటలో అవినీతి రాజ్యం!

నర్సంపేటలో అవినీతి రాజ్యం!
అధికారం ముసుగులో అక్రమ దందాలు
ఎమ్మెల్యే–అధికారులు కుమ్మ‌క్కై ..ప్రభుత్వ పథకాలకూ గండి
కాంగ్రెస్ నాయకుల అవినీతి తెలంగాణలోనే నంబర్ వన్
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కోట్ల దండుకుంటున్నారు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామ‌ని వెల్ల‌డి

కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అవినీతి తెలంగాణలోనే అగ్రస్థానంలో ఉందని, అధికార పార్టీ నేతలతో పాటు పలు శాఖల అధికారులు చేతులు కలిపి అక్రమ దందాలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నర్సంపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ, అధికార యంత్రాంగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారని, ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మట్టిదందా సాగించారని ఆరోపించారు. ఈ అక్రమాలన్నీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, సంబంధిత అధికారుల మధ్య ఒప్పందాల ఫలితమేనని పేర్కొన్నారు.

మట్టి దందాకు శాఖలన్నీ భాగస్వాములే!

కాంగ్రెస్ నాయకులు, పోలీసులు, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్, మైనింగ్, ఐటిడిఎ అధికారులు కలిసి నర్సంపేటలో మట్టిదందా సాగిస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలను శాటిలైట్ చిత్రాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ సేకరించిందని తెలిపారు. ఈ అంశంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టిన కాంగ్రెస్ నాయకులు, అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.

రాజుపేట ఏజెన్సీలో యథేచ్ఛ మైనింగ్

నర్సంపేట మండలం రాజుపేట ఏజెన్సీ శివారులోని ముత్యాలమ్మ తండా గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టిని తవ్వి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అండతో, పోలీస్ అధికారులు, మైనింగ్ అధికారుల సహకారంతో ఈ మైనింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని తెలిపారు. మున్సిపాలిటీ, మైనింగ్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయని, రాత్రంతా వందల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. పిసాచట్టం, వన్ ఆఫ్ సెవెన్ టీ వంటి చట్టాలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ నేతలు అక్రమాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

బెదిరింపులు, దాడులు.. మహిళలపైనా హింస

ఒకే సిండికేట్ ద్వారా మైనింగ్ జరగాలని చెప్పి మిగతావారిని బెదిరించడం, దాడులు చేయడం, మహిళలను కొట్టడం, దూషించడం జరుగుతోందని తెలిపారు. పోలీసులే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దామెర చెరువులో లోతుగా మట్టి తవ్వడం వల్ల ఊటలు వచ్చాయని, భవిష్యత్తులో మెడికల్ కళాశాలకు ప్రమాదం ఉందని ఎన్ఐఏ అధికారులు చెప్పినా పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. నిబంధనల ప్రకారం ఎంత లోతు, ఎంత వెడల్పులో మట్టి తవ్వారన్న వివరాలను సేకరించినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. నర్సంపేటలో ‘‘చీకటి–దొంగలు కలిసి దోపిడీ’’ చేస్తున్న పరిస్థితి నెలకొందని, వీరి ఆగడాలను అడ్డుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ ద్వారా ఆధారాలతో హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, ఖానాపూర్ మాజీ ఎంపీపీ, జిల్లా నాయకులు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, బిఆర్టియూ జిల్లా అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు నాడు ఎడ్ల బండ్లు… నేడు వాహనాల ర‌ద్దీ జిగేల్‌మనే...

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం కాకతీయ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లె...

రోడ్డు పనులు పూర్తి చేయాలి

రోడ్డు పనులు పూర్తి చేయాలి కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ పరిధిలోని కొండ...

పన్నుల చెల్లింపుపై

పన్నుల చెల్లింపుపై వడ్డీ మాఫీ ఉండదు ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను...

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది...

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, ఇనుగుర్తి: కెనాల్ నుంచి బేరు చెరువు...

ఘ‌నంగా హోలీ

ఘ‌నంగా హోలీ కాకతీయ, మరిపెడ: హోలీ వేడుక‌ల‌ను బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో...

ర్యాగింగ్ ఘటనపై

ర్యాగింగ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img