epaper
Sunday, January 18, 2026
epaper

ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం

ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం
సంగారెడ్డి ప్ర‌జ‌ల‌కు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హామీ

కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 2012–13లో ఇళ్ల పట్టాలు పొందినవారితో పాటు ఇప్పటికీ ఇంటి స్థలం లేని పేదలతో సంగారెడ్డి గంజ్ మైదాన్‌లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల ముఖా ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ… తాను 22 సంవత్సరాలు కిరాయి ఇంట్లోనే నివసించానని, అందుకే పేదలకు సొంత ఇంటి స్థలం ఉండాలనే బాధ తనకు ఎక్కువగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి సీఎం *కిరణ్ కుమార్ రెడ్డి*తో మాట్లాడి సంగారెడ్డిలో 5,500 మంది పేదలకు 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించానని గుర్తు చేశారు. ఆ రోజు అలియాబాద్, తోగర్‌పల్లిలో పేదలకు ఇచ్చిన స్థలాలను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వేరే పనులకు వినియోగించారని ఆరోపించారు. ఇచ్చిన స్థలాలపై పదేళ్లలో ఒక్కరూ ఎందుకు ప్రశ్నించలేదని ప్రజలను ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ సంగారెడ్డి, కంది మండలాల్లో 200 ఎకరాల భూసేకరణకు కలెక్టర్‌తో చర్చించామని, ఈ జనవరి నుంచే ప్రక్రియ ప్రారంభించి నవంబర్ నాటికి ఒక కొలిక్కి తీసుకొస్తామని తెలిపారు. భూసేకరణ పూర్తయ్యాక మళ్లీ ప్రజలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు లేని వారు కూడా మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెయ్యి నోటు, క్వార్టర్ సీసా కోసం జీవితాలను నాశనం చేసుకోకండని హితవు పలికారు. నెలకు రూ.5,000 కిరాయి చెల్లిస్తే ఏడాదికి రూ.60 వేలు, పదేళ్లకు రూ.6 లక్షలు నష్టపోయారని, ఆ రోజే సరైన నిర్ణయం తీసుకుంటే ఆ డబ్బు మిగిలేదని అన్నారు. తాను ఓడిపోయానని ఎప్పుడూ బాధపడలేదని, అదే ఓటమి వల్ల తన భార్య నిర్మల కార్పొరేషన్ చైర్‌పర్సన్ అయ్యిందని వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లు తన వద్ద డబ్బులు ఉంటాయని, ఎన్నికల సమయానికే ఉండవని చమత్కరించారు. తాను ఓటుకు డబ్బులు ఇచ్చే రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు.
పదేళ్లు అధికారంలో లేకపోయినా, ఇప్పుడు అధికారంలో ఉన్నామని, తన మాటకు విలువ ఉందని, సీఎం రేవంత్ రెడ్డి తాను చెప్పేది వింటారని చెప్పారు. “జగ్గారెడ్డి గా మాట ఇస్తున్నా… సంగారెడ్డిలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి 80 గజాల స్థలం తప్పకుండా ఇస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..! సంక్రాంతి వేళ రైతులకు నిరాశే మిగిలింది బ్యాంక్ ఖాతాల...

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడిన బైక్ ఒకే...

సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్

సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్ కాకతీయ, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి జిల్లా...

సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి

సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి గణపురం ఆనకట్ట ఆధారంగా వేల ఎక‌రాల సాగు ప్ర‌భుత్వం...

సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత

సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి.. ఎల్లారెడ్డిలో...

Sircilla: సిరిసిల్ల కలెక్టర్‌పై వేటు..సంబురాలు చేసుకున్న నాయకులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచిన సిరిసిల్ల కలెక్టర్...

Maoist: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డికి కన్నీటి వీడ్కోలు.!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి...

ఇలా తయారయ్యారేంట్రా.. బర్రె దూడపై అత్యాచారం..!!

కాకతీయ, మెదక్: కామాంధుల వికృత చేష్టలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనుషులే కాదు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img