epaper
Saturday, January 17, 2026
epaper

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు?

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు?
నల్లబెల్లినే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు
కెనాల్ హద్దుల నిర్ణయంలో అధికారుల ఏకపక్ష ధోరణి
ఒక్క గ్రామానికే పరిమితమై మార్కింగ్ అన్యాయం
నోటీసులతో రైతులు, ప్రజల్లో భయాందోళనలు
బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది
న‌ల్ల‌బెల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి

కాకతీయ, నల్లబెల్లి : ఎస్సారెస్పీ డీబీఎం–38 కెనాల్ భూముల పరిరక్షణ విషయంలో ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గీసుకొండ నుంచి భూపాలపల్లి జిల్లా వరకు విస్తరించి ఉన్న కెనాల్‌కు సంబంధించి, అధికారులు కేవలం నల్లబెల్లి గ్రామానికే పరిమితమై హద్దుల మార్కింగ్ చేపట్టడం అన్యాయమని సారంగపాణి అన్నారు. కెనాల్ ప్రారంభం నుంచి చివరి వరకు రైట్, లెఫ్ట్ హద్దులను శాస్త్రీయంగా, సమగ్రంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ కోణం ఉందా?

పట్టా భూములు కలిగిన రైతులను, ఎన్నేళ్లుగా నివసిస్తున్న సామాన్య ప్రజలను నోటీసులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లినే లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. కేవలం కొంతమందికే నోటీసులు జారీ చేయడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలువ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, పట్టాదారుల నుంచి భూములు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నిబంధనల పేరుతో ఒక్క ప్రాంతాన్నే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమావేశంలో కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ శ్రీనివాస్ గుప్తా, జన్నుజయరావు, గుండాల కుమారస్వామి, సర్పంచులు నాగెళ్ళి జ్యోతిప్రకాశ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఉపసర్పంచ్ గుమ్మడి వేణు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పరకాల పురపోరుకు రంగం సిద్ధం

పరకాల పురపోరుకు రంగం సిద్ధం రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణలు పార్టీలకు సవాల్‌గా మారిన...

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం బ్లాంకెట్లు–స్వెట‌ర్లు ఇవ్వడం లేదు గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం చార్జీలు...

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత అరైవ్‌ అలైవ్‌లో యువతకు...

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట జీరో బిల్లుల లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి లేఖలు విద్యుత్...

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం గౌడ సంఘం నేతలతో మర్యాదపూర్వక...

ప్రజా జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్‌కు కన్నీటి నివాళి

ప్రజా జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్‌కు కన్నీటి నివాళి కాకతీయ, నెల్లికుదురు : ప్రజా...

కాకతీయ ఎఫెక్ట్‌..!

కాకతీయ ఎఫెక్ట్‌..! మేడారంలో పోలీస్ ‘రెడ్ కార్పెట్’కు చెక్ గద్దెల వద్ద ప్రత్యేక సౌకర్యాలపై...

ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి

ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి ఆకేరు పరివాహక ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు అధికారుల తీరుపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img