epaper
Saturday, January 17, 2026
epaper

ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి

ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి
ఆకేరు పరివాహక ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు
అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఆగ్రహం
అభివృద్ధి–సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమంటూ స్ప‌ష్టం

కాకతీయ, నర్సింహులపేట : అధికారులు ఇసుక దోపిడీని వెంటనే అరికట్టాలని డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఆదేశించారు. మండల కేంద్రంలో శనివారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆకేరు పరివాహక ప్రాంతాలైన జయపురం, కౌసల్యదేవిపల్లి, రామన్నగూడెం గ్రామాల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ ఇసుక రవాణా, దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ విధుల్లో మార్పు చూపాలని హెచ్చరించారు.

సంక్షేమం–అభివృద్ధే ధ్యేయం

కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తోందని రామచంద్రనాయక్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. అయితే కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 28 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో రాధిక, ఏఈ సుగుణాకర్, ఎస్సై సురేష్, జీపీఓలు రాధిక, యాకూబ్ పాషా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా నాయకుడు బొబ్బ సోమిరెడ్డి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు దస్రునాయక్, సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ గౌడ్, స్థానిక సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఉపసర్పంచ్ కాస యాకయ్యతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పరకాల పురపోరుకు రంగం సిద్ధం

పరకాల పురపోరుకు రంగం సిద్ధం రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణలు పార్టీలకు సవాల్‌గా మారిన...

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం బ్లాంకెట్లు–స్వెట‌ర్లు ఇవ్వడం లేదు గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం చార్జీలు...

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత అరైవ్‌ అలైవ్‌లో యువతకు...

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట జీరో బిల్లుల లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి లేఖలు విద్యుత్...

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం గౌడ సంఘం నేతలతో మర్యాదపూర్వక...

ప్రజా జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్‌కు కన్నీటి నివాళి

ప్రజా జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్‌కు కన్నీటి నివాళి కాకతీయ, నెల్లికుదురు : ప్రజా...

కాకతీయ ఎఫెక్ట్‌..!

కాకతీయ ఎఫెక్ట్‌..! మేడారంలో పోలీస్ ‘రెడ్ కార్పెట్’కు చెక్ గద్దెల వద్ద ప్రత్యేక సౌకర్యాలపై...

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు?

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు? నల్లబెల్లినే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img