epaper
Saturday, January 17, 2026
epaper

ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

ఒక్క ఛాన్స్ ఇవ్వండి..
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం
మున్సిపాలిటీలకు నిధులు వ‌చ్చేలా చేస్తాం
అవసరమైతే సీఎస్సార్‌ నిధులు కూడా
కాంగ్రెస్ పాలనపై శ్వేతపత్రం డిమాండ్
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీయేనని ధీమా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : రాబోయే మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ—మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి ఎక్కువ సీట్లు కట్టబెడితే ఢిల్లీకి వెళ్లి నేరుగా ప్రధాని *నరేంద్ర మోదీ*ని కలిసి కేంద్రం నుంచి భారీ నిధులు తీసుకొస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధికి కేంద్ర నిధులతో పాటు అవసరమైతే సీఎస్సార్‌ వనరులనూ సమీకరిస్తామని, మాటలకన్నా పనితోనే పాలనకు ప్రమాణం చూపిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఒక్క నయాపైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. నిజంగా దమ్ముంటే ఈ కాలంలో ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. “జై శ్రీరాం” నినాదానికే కాంగ్రెస్ వణుకుతోందని, ప్రజలే స్వయంగా బీజేపీకి ఆ నినాదంతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు.

అసలు పోటీ కాంగ్రెస్–బీజేపీ మధ్యే

క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలహీనమైందని, ఈ ఎన్నికల్లో అసలైన పోటీ కాంగ్రెస్–బీజేపీ మధ్యేనని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో సర్వేలను ఆధారంగా తీసుకోవాలని, గెలిచే అవకాశమున్న కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలని సూచించారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో ఎంఐఎంకు లాభం చేకూర్చేలా కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. కరీంనగర్ నుంచి నిర్మల్ వరకూ మజ్లిస్‌తో ఒప్పందాల మాటలు వినిపిస్తున్నాయని, ఈ కుట్రలను బీజేపీ చిత్తు చేస్తుందని స్పష్టం చేశారు.

ప్రజాబలంతోనే బీజేపీ బరిలోకి

కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బును నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నాయని, బీజేపీ మాత్రం ప్రజలనే నమ్ముకుని బరిలోకి దిగుతోందన్నారు. అభివృద్ధి, ప్రజాసమస్యలు, హిందుత్వమే బీజేపీ ప్రధాన ఎజెండా అని చెప్పారు. పోలింగ్ వరకు కార్యకర్తలు ఒక్కో ఇంటికి కనీసం ఆరు సార్లు వెళ్లి ప్రజలకు నేరుగా భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని, పార్టీ పదవులు లేదా నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట

కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట మూడు మేయ‌ర్ ప‌ద‌వులు, 38 ఛైర్‌పర్సన్...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img