epaper
Wednesday, March 4, 2026
epaper

వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును!

వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును!
శతాబ్ది ముగింపు సభకు ఖమ్మం గడ్డ సిద్ధం
ఎర్రజెండాతోనే మతోన్మాదానికి కళ్లెం
లక్షమంది తరలివచ్చేలా సన్నాహాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : వందేళ్ల సీపీఐ పోరాటాల స్పూర్తితో ప్రజా ఉద్యమాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని, ఖమ్మం నగరంలో జరగనున్న సీపీఐ శతాబ్ది ముగింపు బహిరంగ సభను ఆ పోరాటాలకు వేదికగా మలుచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. ఈ నెల 18న ఖమ్మం నగరంలో జరగనున్న శతాబ్ది ముగింపు సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణ పరిధిలోని వన్నందాస్ గడ్డ, పాత కొత్తగూడెం, బర్మా క్యాంపు, ప్యూన్ బస్తి, బూడిదగడ్డ, మేదరబస్తీ, ప్రగతి నగర్‌తో పాటు లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో సాబీర్ పాషా పాల్గొని మాట్లాడారు. దేశంలో మతోన్మాద, కార్పొరేట్ శక్తుల దాడులను అడ్డుకోగల శక్తి కేవలం ఎర్రజెండాకే ఉందన్న విషయాన్ని సిపిఐ వందేళ్ల చరిత్ర నిరూపించిందని సాబీర్ పాషా స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ సిపిఐ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.

ఖమ్మం సభతో నూతన ఉత్తేజం

ఖమ్మంలో జరగనున్న శతాబ్ది ముగింపు సభలో వేలాది మంది క్రమశిక్షణాయుత రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు, విప్లవ గీతాల సాంస్కృతిక ప్రదర్శనలు పీడిత వర్గాల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని తెలిపారు. ఈ సభ ఖమ్మం నగరాన్ని ఎర్ర సంద్రంలా మార్చే శక్తిని కలిగి ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని, శతాబ్ది ముగింపు సభను సక్సెస్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రచార జాతాలు నిర్వహించి సభపై విస్తృత ప్రచారం పూర్తి చేసినట్లు తెలిపారు. కరపత్రాలు, పోస్టర్లు, మీడియా మాధ్యమాల ద్వారా అన్నివర్గాల ప్రజలకు, ప్రతి గడపకు సభ సమాచారాన్ని చేరవేశామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే లక్షమంది స్వచ్ఛందంగా ఖమ్మం తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార సభల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, జిల్లా సమితి సభ్యులు భూక్యా శ్రీనివాస్, మునిగడప పద్మ, నాయకులు నూనావత్ గోవిందు, గోపి కృష్ణ, గుత్తుల శ్రీనివాస్, తూముల శ్రీను, శాపావత్ రవి, మోతిరాం, రాములు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దాతల సాయం కోసం ఎదురుచూపు!

దాతల సాయం కోసం ఎదురుచూపు! పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు ఆపరేషన్‌కు...

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు! భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52...

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మెడికల్ బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం డిస్మిస్ ఉద్యోగులకు...

మహాసభలను జయప్రదం చేయండి

మహాసభలను జయప్రదం చేయండి సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత‌ కందగట్ల సురేందర్ పిలుపు కాకతీయ,...

అభివృద్ధికి మారుపేరు తుమ్మల

అభివృద్ధికి మారుపేరు తుమ్మల ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం ప్రజలు కర్రుకాల్చి వాత...

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాహుల్...

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img