epaper
Wednesday, March 4, 2026
epaper

జనసంద్రంగా మేడారం!

జనసంద్రంగా మేడారం!
ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు
కోట్ల ఖర్చు చేసినా కనిపించని మౌలిక సౌకర్యాలు
తాగునీరు, మరుగుదొడ్ల కొరతపై భ‌క్తుల ఆగ్రహం
ఇబ్బందుల నడుమ కూడా అమ్మవార్ల దర్శనంతో పరవశం

కాకతీయ, ములుగు ప్రతినిధి : సంక్రాంతి పండుగ ముగియగానే మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర జనసంద్రంగా మారింది. సెలవులు ముగిసినప్పటికీ అమ్మవార్ల దర్శనం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతమంతా భక్తుల కోలాహలంతో కిటకిటలాడింది. భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం బంగారు బుట్టలను తలపై పెట్టుకొని గద్దల వైపు సాగారు. తమ కోరికలు తీరాలనే ఆకాంక్షతో “కొంగు బంగారం”గా ప్రసిద్ధిగాంచిన వనదేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మలకు వడి బియ్యం, బంగారం, చీరలు, సారెలు, పసుపు–కుంకుమ, కొబ్బరికాయలతో నైవేద్యాలు సమర్పించారు. అమ్మవార్ల కృపతో కుటుంబాలు సుఖశాంతులతో, పిల్లాపాపలు పాడిపంటలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. మొక్కులు చెల్లించిన అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా కంక వనాల మధ్య ఉన్న పచ్చని ప్రకృతిలో వంటావార్పు చేసుకుంటూ జాతర ఆనందాన్ని ఆస్వాదించారు. చిన్నారులు అడవీ ప్రాంతంలో ఆటలాడుతూ ఉల్లాసంగా గడిపారు. పెద్దలు అమ్మవార్ల కథలను, జాతర విశిష్టతను పిల్లలకు వివరిస్తూ సంప్రదాయాన్ని తరతరాలకు అందించారు. ఈ విధంగా మేడారం మహాజాతర ప్రతి కుటుంబానికి మరపురాని అనుభూతిగా మారింది. శుక్రవారం ఒక్కరోజే 10 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం విశేషం.

కనిపించని సౌకర్యాలు.. భక్తుల అవస్థలు

భక్తుల రద్దీ పెరిగిన మేరకు సౌకర్యాలు అందకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. జంపన్న వాగు, గద్దల పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు జనంతో నిండిపోయాయి. జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు జాతర సమయానికి అందుబాటులోకి రాకుండా తాడులతో కట్టివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరుగుదొడ్లు లేని పరిస్థితుల్లో చాలామంది ఆరుబయటే మలమూత్రాలు చేయాల్సి రావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆపరేటర్ ట్యాప్స్‌లో నీరు లేకపోవడంతో భక్తులు చేతిపంపులపైనే ఆధారపడ్డారు. తెచ్చుకున్న నీటిని పరస్పరం పంచుకుంటూ నీటి ఎద్దడిని తట్టుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పించినప్పటికీ, జాతర సమయంలోనే వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని భక్తులు, స్థానికులు విమర్శిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులు మరింత సమర్థంగా అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ అన్ని ఇబ్బందులను లెక్కచేయకుండా భక్తులు అమ్మవార్ల దర్శనంతో పరవశించి, మేడారం మహాజాతరను జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మలుచుకుని ఆనందంగా తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టరేట్‌లో...

డ్రెనేజీలోనే తాగునీటి పైపులు!

డ్రెనేజీలోనే తాగునీటి పైపులు! కాశీబుగ్గలో మురికికాల్వ నిర్మాణం అస్తవ్యస్తం పట్టించుకోని అధికారులు కాకతీయ, వరంగల్: వరంగల్...

కొమ్మాల బీఅర్ఎస్ ప్రభ బండ్ల సంద‌డి

కొమ్మాల బీఅర్ఎస్ ప్రభ బండ్ల సంద‌డి కాకతీయ, చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలం నుండి...

కొమ్మాల జాతరకు బీజేపీ ప్రభ బండ్లు

కొమ్మాల జాతరకు బీజేపీ ప్రభ బండ్లు కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలో...

కొమ్మాల జాతరకు కాంగ్రెస్ ప్రభ బండ్లు

కొమ్మాల జాతరకు కాంగ్రెస్ ప్రభ బండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, ఎంపీ బలరాం...

బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ

బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలకేంద్రం మానసపల్లికి...

బీఆర్ఎస్ ప్రభ బండికి అగ్నిప్రమాదం

బీఆర్ఎస్ ప్రభ బండికి అగ్నిప్రమాదం బాణాసంచా మోతలో చెలరేగిన మంటలు అలంకరణ సామగ్రి దగ్ధం కాకతీయ,...

కొమ్మాల జాతరలో ప్రభల హోరు..

కొమ్మాల జాతరలో ప్రభల హోరు.. జాత‌ర‌లో రాజకీయ ఆధిప‌త్య‌ రంగు..! భక్తులతో కిటకిటలాడిన జాతర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img