epaper
Friday, January 16, 2026
epaper

మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్!

మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్!
సామాన్య భక్తులపై మాత్రం కఠినత్వం
వృద్ధులు–వికలాంగుల్ని పట్టించుకోని వైఖరి
పోలీస్ కుటుంబాలకు ప్రత్యేక దారి..!
‘అమ్మవార్ల ముందు అందరూ సమానమే కదా?’

కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు కొనసాగుతున్న వేళ, జాతర అధికారిక ప్రారంభానికి ముందే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం గద్దల వైపు భక్తిశ్రద్ధలతో కదిలారు. అయితే గద్దల వద్ద డ్యూటీలో ఉన్న కొందరు పోలీసుల వైఖరి సామాన్య భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. శుక్రవారం ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో భద్రతా చర్యలలో భాగంగా పోలీసు యంత్రాంగం అమ్మవార్ల గద్దల చుట్టూ భారీ ఇనుప కంచెలు ఏర్పాటు చేసింది. కంచెల వెలుపల నుంచే దర్శనం కల్పించడమే సరైన నిర్ణయమని చాలా మంది భావించారు. రద్దీ నియంత్రణ, భక్తుల భద్రత దృష్ట్యా ఇది అవసరమేనని అభిప్రాయపడ్డారు.

పోలీస్ కుటుంబాలకు ప్రత్యేక దారి..!

అయితే అదే సమయంలో గద్దల వద్ద విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసులు తమకు తెలిసినవారికి, ముఖ్యంగా ఇతర పోలీస్ కుటుంబాలకు మాత్రమే గేట్లు తెరిచి గద్దల ప్రాంగణంలోకి అనుమతించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సామాన్య భక్తులు గంటల తరబడి కంచెల వెలుపల నిలబడినా, పోలీస్ కుటుంబాలు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా గద్దల వద్దకు వెళ్లి దర్శనం చేసుకోవడం చూసి భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముసలివారు, వికలాంగులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు ఎండలో, గుంపుల మధ్య నలుగుతూ కంచెల వెలుపలే ఉండిపోయినా పట్టించుకోని పరిస్థితి కనిపించింది. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు బయట నుంచే మొక్కులు చెల్లించుకోవాల్సి రాగా, పోలీస్ కుటుంబాలకు మాత్రం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం అన్యాయమని భక్తులు వాపోయారు.

‘అమ్మవార్ల ముందు అందరూ సమానమే కదా?’

అమ్మవార్ల దర్శనం కోసం వచ్చిన భక్తులు, ‘అమ్మవార్ల ముందు అందరూ సమానమే… కానీ ఇక్కడ మాత్రం పోలీస్ వారికే ప్రాధాన్యం. మేమంతా భక్తులం కాదా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ‘తెలిసినవారు’ అనే కారణంతో గేట్లు తెరవడం పోలీసుల విధి నిర్వహణపై ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు. మేడారం మహాజాతర కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఇలాంటి పవిత్రమైన సందర్భంలో అధికారులు, పోలీసుల వైఖరి సమానత్వంతో ఉండాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ అయినా, సామాన్యుడైనా – అమ్మవార్ల ముందు అందరూ ఒక్కటేనన్న భావనను కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని భక్తులు స్పష్టం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జనసంద్రంగా మేడారం!

జనసంద్రంగా మేడారం! ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు కోట్ల ఖర్చు చేసినా కనిపించని మౌలిక...

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఐనవోలు మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు ప్రజల...

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం యువతకు క్రమశిక్షణ, ఐక్యతను నేర్పే క్రీడలు సంక్రాంతి సందర్భంగా...

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు కాకతీయ, రాయపర్తి : మండలంలోని కొండాపురం...

డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ

డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ ఆర్టీసీ డ్రైవర్ల భుజాలపైనే వేలాది మంది భద్రత ‘ఆరైవ్‌.....

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం దేవుని గుట్టపై భక్తుల సందడి కాకతీయ, నెల్లికుదురు...

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు 15 మంది అరెస్టు… మరో 9 మంది...

పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం!

పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం! కక్షసాధింపు అనడం సిగ్గుచేటు ఇష్టమొచ్చినట్లు జిల్లాల విభజన బీఆర్ఎస్ పాపం వరంగల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img