epaper
Tuesday, March 3, 2026
epaper

నిబంధనల గీత దాటొద్దు!

నిబంధనల గీత దాటొద్దు!
భద్రత, ప్రోటోకాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మినిట్ టు మినిట్ షెడ్యూల్‌ను సన్నద్ధం చేసుకోవాలి
అధికారుల‌కు జిల్లా ఇంచార్జి కలెక్టర్ పి.శ్రీజ ఆదేశాలు
సీఎం పర్యటన ఏర్పాట్లపై యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు

కాకతీయ, ఖమ్మం : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా నిబంధనలు, ప్రోటోకాల్ ప్రకారమే జరగాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. జనవరి 18న ఖమ్మం జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారం, మినిట్ టు మినిట్ షెడ్యూల్ వెలువడకముందే అవసరమైన సన్నద్ధత ఏర్పాట్లన్నింటిని పూర్తి చేయాలని సూచించారు. పర్యటనలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల షెడ్యూల్ ఇదే

జనవరి 18న ఉదయం ముఖ్యమంత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయి, జేఎన్‌టీయూ కళాశాల భవన నిర్మాణం, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే నూతన మార్కెట్ యార్డు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, కూసుమంచి 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్‌లను ఆవిష్కరించి అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం పూర్తి స్థాయి భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీఎం కాన్వాయ్‌లో వినియోగించే వాహనాలను ముందస్తుగానే పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అవసరమైన అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. నర్సింగ్ కళాశాల, సర్దార్ పటేల్ స్టేడియం వద్ద హెలిప్యాడ్‌లను డీజీసీఏ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసి అక్కడ ఫైర్ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జిల్లాలోని సీనియర్ వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని 108 అంబులెన్స్‌తో పాటు సీఎం కాన్వాయ్‌లో ప్రోటోకాల్ ప్రకారం సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అతిథి గృహాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, నాణ్యమైన స్నాక్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి సర్టిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. విధులు నిర్వహించే అధికారులకు ప్రత్యేక ఐడీ కార్డులు అందించాలని, మీడియాతో సమన్వయం చేసుకుంటూ విస్తృత కవరేజ్ వచ్చేలా చూడాలని సూచించారు. అలాగే జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి పనులపై శాఖల వారీగా బ్రీఫ్ నోట్స్ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మెడికల్ బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం డిస్మిస్ ఉద్యోగులకు...

మహాసభలను జయప్రదం చేయండి

మహాసభలను జయప్రదం చేయండి సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత‌ కందగట్ల సురేందర్ పిలుపు కాకతీయ,...

అభివృద్ధికి మారుపేరు తుమ్మల

అభివృద్ధికి మారుపేరు తుమ్మల ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం ప్రజలు కర్రుకాల్చి వాత...

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాహుల్...

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు కలెక్టరేట్‌లో ప్రజల అర్జీల స్వీకరణ కాకతీయ,...

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి ఎస్పీ రోహిత్ రాజ్‌ కాకతీయ, కొత్తగూడెం రూరల్: హోళీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img