epaper
Monday, March 2, 2026
epaper

విమ‌ర్శ‌లు కాదు..యూరియా తెప్పించండి

విమ‌ర్శ‌లు కాదు..యూరియా తెప్పించండి
కేటాయించిన 50వేల మెట్రిక్‌లు రావాలి
బీజేపీ నేత‌ల విమ‌ర్శ‌లు అర్థ‌ర‌హితం
రైతుల‌తో ఆందోళ‌న‌ల‌కు బీఆర్ ఎస్ కుట్ర‌లు
యూరియా కొరతపై ప్రతిపక్షాల వ్యాఖ్యలు అర్థరహితం
రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రైతుల‌తో ఆందోళ‌న చేయించ‌డం కాదు.. ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్ల‌డం కాదు.. మీకు చిత్త‌శుద్ధి ఉంటే తెలంగాణ‌కు ఈ సీజ‌న్లో కేటాయించిన యూరియాను వెంట‌నే స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాలంటూ మంత్రి తుమ్మ‌ల బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. తెలంగాణ రైతాంగం అవసరాల దృష్ట్యా కేటాయింపు చేసిన‌ 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రాష్ట్రానికి చేరేలా చూడాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో యూరియా కొరతపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేసిన నిరసన ప్రదర్శనతో కేంద్ర ప్ర‌భుత్వంలో క‌ద‌లిక వ‌చ్చింద‌న్నారు.

ఎంపీల ఆందోళనతో తక్షణమే ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ చేశారన్నారు.కర్ణాటక నుంచి 10800 మెట్రిక్ టన్నుల యూరియా మొదటి షిప్ మెంట్ ప్రారంభ‌మైంద‌న్నారు. ఈ వారంలో మరో మూడు షిప్ మెంట్ ల ద్వారా యూరియా సరఫరా చేయాలని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆదేశాలు జారీ చేశార‌ని అన్నారు. ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నందున జాప్యం లేకుండా సరఫరా చేయాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని మంత్రి తుమ్మల కోరారు.

తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఈ ఖరీఫ్ సీజన్ కు తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయింపులు చేసిన‌ట్లు తెలిపారు. ఆగస్ట్ 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలి కానీ ఇప్పటి వరకు 5.42 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశార‌ని మంత్రి తెలిపారు. కేటాయించిన యూరియాలో 2.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాలో కొరత వల్ల రైతాంగంలో ఆందోళన నెలకొంద‌న్నారు. ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువ ఉన్నందున కేటాయించిన యూరియాకు అదనంగా 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖను మంత్రి తుమ్మల కోరారు. ఈ వారంలోనే మిగతా మూడు షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరా సకాలంలో చేయాలని మంత్రి తుమ్మల కోరారు.

బ‌ఫ‌ర్ స్టాకుపై ప్ర‌తిప‌క్షాల వ్యాఖ్య‌లు అర్థ ర‌హితం..!

బఫర్ స్టాక్స్ పై ప్రతిపక్ష పార్టీ ల నేతల వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు. మార్క్ ఫెడ్ ను నోడల్ ఏజెన్సీ గా నియమించి ఎరువులు ముందుగానే తెప్పించి మే నుంచి బఫర్ స్టాక్స్ నిలువ చేయాలని ప్రతిపాదన చేస్తే కేంద్రం ప్రభుత్వం జాప్యం చేస్తూ యూరియా కొరతకు కారకులయ్యార‌ని అన్నారు.కొందరు బీఆర్ఎస్ నేతలు వారి అనుచరులతో యూరియా కేంద్రాల వద్ద చెప్పులు క్యూ లైన్ లో పెట్టి ప్రేరేపిత ఆందోళ‌న‌ల‌కు పాల్ప‌డ్డార‌ని అన్నారు. యూరియా కొరత పై రైతాంగం ఆందోళన చెందే విధంగా కుట్రలు చేస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అవగాహన రాహిత్యంతో సమస్యను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. రైతాంగం ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, తెలంగాణ రైతాంగంపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే యూరియా సరఫరాలో కొరత లేకుండా చేయాలని తుమ్మల తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img