epaper
Monday, March 2, 2026
epaper

పేదల బియ్యం గల్లంతు

పేదల బియ్యం గల్లంతు
కరీంనగర్ జిల్లాలో భారీ సీఏంఆర్ స్కామ్
35,563 మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్
ప్రభుత్వానికి రూ.124 కోట్లకుపైగా నష్టం
ఏళ్లుగా డిఫాల్టర్లపై చర్యలే లేవు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం భారీగా మాయం కావడం తీవ్ర సంచలనంగా మారింది. సీఏంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) పేరుతో ప్రభుత్వానికి అందాల్సిన బియ్యం ఏళ్ల తరబడి మిల్లుల వద్దే నిలిచిపోవడంతో ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కల ప్రకారం వేల మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్‌గా నమోదవుతున్నా, సంబంధిత మిల్లులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యం, అండదండలే కారణమన్న విమర్శలు బలపడుతున్నాయి. పేదల కడుపు నింపాల్సిన బియ్యం దారి మళ్లుతుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

2012 నుంచే మొదలైన బకాయిలు

కరీంనగర్ జిల్లా రేషన్ వ్యవస్థలో సీఏంఆర్ డిఫాల్ట్ సమస్య కొత్తది కాదని అధికారిక రికార్డులే చెబుతున్నాయి. 2012–13 ఖరీఫ్ నుంచే బకాయిలు మొదలై 2024 వరకు కొనసాగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2012–13 ఖరీఫ్‌లో 2,589.866 మెట్రిక్ టన్నులు, 2013–14 రబీ సీజన్‌లో 35.316 మెట్రిక్ టన్నులు, 2014–15 ఖరీఫ్‌లో 178.782 మెట్రిక్ టన్నులు డిఫాల్ట్‌గా నమోదయ్యాయి.
తర్వాత కొంత విరామం అనంతరం 2021–22 ఖరీఫ్‌లో 4,106.105 మెట్రిక్ టన్నులు, 2022–23 రబీ సీజన్‌లో ఏకంగా 20,115.377 మెట్రిక్ టన్నులు, 2023–24 ఖరీఫ్‌లో మరో 8,507.130 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి.

19 మిల్లులు.. 22 డిఫాల్ట్ ఎంట్రీలు

జిల్లాలో మొత్తం 19 రైస్ మిల్లులు డిఫాల్ట్‌గా నమోదైనట్లు అధికారిక జాబితా చెబుతోంది. కొన్ని మిల్లులు పునరావృతంగా బకాయిలు పెంచుకున్నట్లు రికార్డుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 22 డిఫాల్ట్ ఎంట్రీలతో ప్రభుత్వానికి అందాల్సిన సీఏంఆర్ బియ్యం 35,563.576 మెట్రిక్ టన్నులుగా తేలింది. ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.137 కోట్లుగా ఉండగా, కనీసం రూ.124 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క జిల్లాలోనే ఇంత భారీ మొత్తంలో బియ్యం గల్లంతు కావడం రేషన్ వ్యవస్థ పర్యవేక్షణపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తోంది.

నామమాత్రపు కేసులకే పరిమితమైన చర్యలు

ఇంత భారీ స్థాయిలో డిఫాల్ట్‌లు నమోదవుతున్నా అధికారుల చర్యలు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డిఫాల్ట్ మిల్లులపై రికవరీ చర్యలు, లైసెన్సుల రద్దు, కఠిన శిక్షలు వంటి చర్యలు ఎక్కడా కనిపించడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నామమాత్రపు కేసులు నమోదు చేసి వ్యవహారాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోతున్నా బాధ్యత వహించాల్సిన శాఖలు మౌనంగా ఉండటం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ధోరణి కొనసాగితే రేషన్ వ్యవస్థలో డిఫాల్ట్‌లు మరింత పెరిగే ప్రమాదం ఉందని, తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img