epaper
Sunday, March 1, 2026
epaper

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్
అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలు
రియల్ కరెన్సీ చరిత్రలోనే కనిష్ఠానికి పతనం
పోర్టుల్లోనే రూ.2,000 కోట్ల బాస్మతి నిల్వ
పంజాబ్–హర్యానా రైతులకు ధరల ముప్పు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఇరాన్‌పై అమెరికా, ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌లో కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో, భారత్ నుంచి జరిగే ప్రీమియం బాస్మతి బియ్యం సరఫరాకు మరోసారి అనిశ్చితి నెలకొంది. అణు, క్షిపణి కార్యక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రాంతీయ అస్థిరతకు మద్దతు ఇస్తోందన్న ఆరోపణలతో విధించిన ఆంక్షల కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా ఇరానియన్ కరెన్సీ రియల్ పతనమై, ద్రవ్యోల్బణం 40 శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.

రియల్ పతనమే ప్రధాన కారణం

ఇరాన్ రియల్ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు డాలర్‌కు సుమారు 90 వేల రియల్ ఉండగా, ప్రస్తుతం అది 1.50 లక్షలకు చేరింది. దీంతో ఆహార దిగుమతులు ఇరాన్‌కు భారంగా మారాయి. ఇంతకు ముందు ఆహార దిగుమతులకు డాలర్‌కు 28,500 రియల్ ప్రిఫరెన్షియల్ రేటుతో సబ్సిడీ ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం, తాజా సంక్షోభంతో ఆ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది. దీంతో భారతీయ ఎగుమతిదారులు సరుకులు పంపేందుకు వెనుకంజ వేస్తున్నారు.

పోర్టుల్లోనే బాస్మతి నిల్వ

ఈ పరిణామాల కారణంగా కనీసం రూ.2,000 కోట్ల విలువైన బాస్మతి బియ్యం అంతర్జాతీయ పోర్టుల్లోనే నిలిచిపోయినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. గతంలో భారత్–ఇరాన్ మధ్య వాణిజ్యం బార్టర్ విధానంలో సాగింది. అయితే భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడంతో ఆ విధానం కూడా నిలిచిపోయింది. ఇరాన్ భారత బాస్మతి బియ్యానికి అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం సగటున 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని, సుమారు రూ.12,000 కోట్ల విలువకు ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో దాదాపు 40 శాతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే సరఫరా అవుతుంది.

ఎగుమతుల్లో ఇదే విధంగా అనిశ్చితి కొనసాగితే, ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైస్ మిల్లర్లతో పాటు రాబోయే రోజుల్లో రైతులకు లభించే ధరలు కూడా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జూన్ 21 తర్వాత ఇరాన్ విదేశీ దిగుమతులను నిలిపివేసి సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభిస్తుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంతో ఈ సరఫరా చక్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img