epaper
Monday, March 2, 2026
epaper

అధికార పార్టీలో టికెట్లకు నేతల ఆరాటం

అధికార పార్టీలో టికెట్లకు నేతల ఆరాటం
ఒక్కో వార్డులో ఐదుగురికి పైగా ఆశావహులు
కోర్ కమిటీ వద్దకు దరఖాస్తుల వెల్లువ
స్వతంత్రంగా పోటీపై చర్చలు
రామకృష్ణాపూర్ మున్సిపల్‌లో వేడెక్కిన రాజ‌కీయం

కాకతీయ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం నేతల ఆరాటం మొదలైంది. 22 వార్డుల పరిధిలో అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఒక్కో వార్డులో ఐదుగురికి పైగా ఆశావహులు ముందుకు రావడంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పట్టణ కోర్ కమిటీకి టికెట్ల కోసం నేతలు వరుసగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకారం ఆశావహుల వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు. పాత నాయకులు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల కలయికతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది తప్పడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆశావహుల సంఖ్య పెరగడం, టికెట్ల కేటాయింపులో సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాత నాయకులకే అవకాశాలు ఇవ్వాలంటూ కొందరు నేతలు కోర్ కమిటీపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశంలో నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నట్లు సమాచారం. టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలన్న ఆలోచనలో కొందరు ఉన్నట్లు చర్చ సాగుతోంది. అదే జరిగితే అధికార పార్టీ కాంగ్రెస్‌కు నష్టం తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రిజర్వేషన్లపై స్వల్ప మార్పుల యోచన

రిజర్వేషన్ల అంశంలో స్వల్ప మార్పులు చేయాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే వ్యూహాలపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం. చివరకు టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌కు ఎంతవరకు అనుకూలత వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు దఫాలుగా సర్వేలు పూర్తయ్యాయని చెబుతున్నప్పటికీ, ఇప్పుడు పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాలు నిర్వహించడంపై నేతల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు వార్డుల కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడంపై కోర్ కమిటీ సభ్యులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్థానిక నేతలు విఫలమయ్యారని, సోషల్ మీడియాలోనూ పార్టీకి కావాల్సినంత వేగం లేదన్న అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. చివరగా పార్టీ గెలుపు, అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img