epaper
Monday, March 2, 2026
epaper

మేం గొప్ప‌లు చెప్పుకోవ‌డం లేదు

మేం గొప్ప‌లు చెప్పుకోవ‌డం లేదు
ప్ర‌భుత్వ అభివృద్ధిని శ్రేణుల‌కు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి
కొన్ని పార్టీలు మూడు ద‌శాబ్దాల క్రితం చేసిన‌వి కూడా చెప్పుకుంటున్నాయి
కాంగ్రెస్ చేసిన ప‌నులు చెబితే ఇంకో పార్టీకి భవిష్యత్తే ఉండదు
మధిర మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలి
రేపటి తరాల భవిష్యత్తు కోస‌మే మ‌ధిర అభివృద్ధి
క్లీన్ అండ్ గ్రీన్ నగరాన్ని కోరుకునే వారినే గెలిపించాలి
మధిర మున్సిపల్ కీలక నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి ఈ దేశంలో భవిష్యత్తే ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన కొద్దిపాటి పనులను మైకు దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటుంటే, కాంగ్రెస్ శ్రేణులు తమ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకంజలో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యం
మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిర నగరానికి అందించిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రతి నాయకుడు రోజుకు కనీసం పదిమందికి వివరించగలిగితే చాలని సూచించారు.
మధిర పట్టణం క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా మారితేనే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆ దిశగా ఆలోచించే, అభివృద్ధిని కోరుకునే వ్యక్తులనే ప్రజలు గెలిపించుకోవాలని సూచించారు. మధిర పట్టణానికి కాంగ్రెస్ చేయని అభివృద్ధి పని అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, చెరువులను టూరిజం పార్కులుగా అభివృద్ధి చేయడం, డిగ్రీ, ఇంటర్, హైస్కూల్ విద్యాసంస్థలకు సొంత భవనాలు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం, బస్టాండ్, ట్రెజరీ, బ్యాంకుల ఏర్పాటు వంటి అనేక కీలక అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని తెలిపారు.

డ్రైనేజీ పనులు పూర్తైతే నగర స్వ‌రూప‌మే మారుతుంది

ఒక మంచి ఇల్లు కట్టే సమయంలో మొదట సిమెంట్, కంకర, ఇటుకలు చిందరవందరగా కనిపిస్తాయని, కానీ ఇల్లు పూర్తయిన తర్వాతే అందంగా కనిపిస్తుందని ఉపమానం చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయితే మధిర పట్టణం పూర్తిగా సుందరంగా మారుతుందని తెలిపారు. డ్రైనేజీ పనులు పూర్తయిన ప్రాంతాల్లో మట్టిని వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డ్రైనేజీ పనులు పూర్తయిన అనంతరం మధిర నగరం అంతటా కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. టాయిలెట్ల మురుగునీరు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు వెళ్లి శుద్ధి అనంతరం విడుదల అవుతుందని, వర్షపు నీటిని ఏట్లోకి మళ్లించేందుకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఉంటుందని వివరించారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే అభివృద్ధి పనులు కొనసాగుతాయని, పట్టణం అభివృద్ధి చెందితే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు కలెక్టరేట్‌లో ప్రజల అర్జీల స్వీకరణ కాకతీయ,...

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి ఎస్పీ రోహిత్ రాజ్‌ కాకతీయ, కొత్తగూడెం రూరల్: హోళీ...

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు

స్మార్ట్ కిడ్జ్‌లో హోలీ సంబరాలు ముందస్తుగా రంగుల పండుగ వేడుకలు సహజ రంగులతో చిన్నారుల...

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో...

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ కాకతీయ, కారేపల్లి: ఖమ్మం...

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img