epaper
Monday, March 2, 2026
epaper

సర్వే ఆధారంగానే సీట్లు ఇవ్వండి

సర్వే ఆధారంగానే సీట్లు ఇవ్వండి
టిక్కెట్ ఎవరికైనా… కాషాయ జెండా మనదే
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీజేపీ నేత‌ల బాసట
కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీ వ్యూహంపై నేత‌ల స‌మీక్ష‌
రెబల్స్‌కు తావులేదని కేంద్ర‌మంత్రికి స్పష్టం

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : “టిక్కెట్ ఎవరికిచ్చినా మా డివిజన్‌లో బీజేపీ అభ్యర్థినే గెలిపిస్తాం. మాకు టిక్కెట్ రాకపోయినా నారాజ్ కాబోం… రెబల్‌గా పోటీ చేయం… కలిసికట్టుగా ప్రచారం చేసి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం” అంటూ కరీంనగర్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ నాయకులంతా ముక్తకంఠంతో నినదించారు. కరీంనగర్ రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఈ ఏకగ్రీవ స్వరం బీజేపీ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రేకుర్తిలోని శుభం గార్డెన్స్‌లో జరిగిన కీలక సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు, కోమాల ఆంజనేయులు, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, బోయినపల్లి ప్రవీణ్ రావు, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్

ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీకి అనుకూల వాతావరణం స్పష్టంగా ఉందని, ప్రజల చూపంతా బీజేపీ వైపేనని ధీమా వ్యక్తం చేశారు. టిక్కెట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఎవరికీ ముందస్తు హామీలు ఇవ్వలేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు చేసిన వారికి టిక్కెట్లు ఉండవు అంటూ కఠిన హెచ్చరిక జారీ చేశారు. బీజేపీలో కుటుంబ పాలనకు తావులేదని స్పష్టం చేశారు.

సర్వేనే ప్రామాణికం

టిక్కెట్ల కేటాయింపులో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలనే దానిపై నాయకుల అభిప్రాయాలను బండి సంజయ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన కార్పొరేషన్ నాయకులంతా చేతులెత్తి మరోసారి స్పష్టం చేశారు. “సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఇవ్వండి… టిక్కెట్ ఎవరికిచ్చినా బీజేపీ గెలుపే లక్ష్యం… రెబల్స్ ఉండరు… కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురుతుంది” అంటూ నినాదాలు చేశారు.
ఇదే సమయంలో గడపగడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అడుగుతామని, బీజేపీకి ఓటేయకపోతే కరీంనగర్ ప్రజలకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి రావాలని ప్రయత్నిస్తున్న వారిలో అవినీతిపరులు, కబ్జాదారులకు మాత్రం తావివ్వొద్దని ఈ సమావేశంలో స్పష్టమైన తీర్మానం చేశారు. గెలుపు అవకాశాలు ఉన్న గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని బండి సంజయ్ తుది మాటగా తేల్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img