epaper
Thursday, January 15, 2026
epaper

అన్నంలో పురుగులు.. ఇనుప తీగలు

అన్నంలో పురుగులు.. ఇనుప తీగలు
కేయూ మెస్‌లో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ నిర్ల‌క్ష్యం
విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటం
హాస్టల్ మెస్ నిర్వాహణపై తీవ్ర విమర్శలు
వీసీ చాంబర్‌ను ముట్టడించిన విద్యార్థినులు

కాకతీయ, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయంలోని గర్ల్స్ హాస్టల్ మెస్‌లో తీవ్ర భోజన భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులకు వడ్డించిన భోజనంలో పురుగులు, ఇనుప తీగలు బయటపడటంతో క్యాంపస్‌లో కలకలం రేగింది. విద్యార్థినుల ఆరోగ్యంతో యాజమాన్యం చెలగాటమాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నం, కూరలో పొడవాటి పురుగులు, నలుపు రంగు ఇనుప తీగలు స్పష్టంగా కనిపించాయని విద్యార్థినులు తెలిపారు. తినే సమయంలోనే ఈ వస్తువులు గుర్తించడంతో పలువురు భోజనం వదిలేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటపడింది.

ఎప్పటి నుంచో నాసిరకం భోజనం

ఇది మొదటిసారి కాదని, గత కొంతకాలంగా గర్ల్స్ హాస్టల్ మెస్‌లో నాణ్యతలేని ఆహారం, పాత కూరగాయలు, సరైన వంట విధానం లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మెస్ సిబ్బందికి, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. వంటశాల, పాత్రలు, నిల్వ గదుల్లో పరిశుభ్రత లోపించిందని, ఆహార భద్రతపై నిరంతర తనిఖీలు జరగడం లేదని పేర్కొన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని అభిప్రాయపడ్డారు. ఇక హాస్టల్ పరిసరాల్లో వీధి కుక్కలు నిర్బంధం లేకుండా తిరగడం, మెస్ ప్రాంతంలోకి కూడా చేరడం ఆందోళన కలిగిస్తోందని విద్యార్థినులు తెలిపారు. ఆహార ప్రాంతాల్లో జంతువుల సంచారం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు పెద్ద ఎత్తున వీసీ చాంబర్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. గర్ల్స్ హాస్టల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. యాజమాన్యం స్పందించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

వారం రోజుల్లో పరిష్కారం హామీ

విద్యార్థినుల నిరసన తీవ్రత పెరగడంతో యూనివర్సిటీ అధికారులు స్పందించారు. వీసీ ఆదేశాల మేరకు విద్యార్థినులతో సమావేశం ఏర్పాటు చేసి, వారం రోజుల్లో గర్ల్స్ హాస్టల్‌కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెస్ నిర్వహణపై సమీక్ష, పరిశుభ్రత మెరుగుదల, భోజన నాణ్యత పెంపు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని, ఈసారి కూడా మాటలకే పరిమితం చేసే అవకాశం ఉందని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు శాశ్వతంగా పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్‌లో కనీస సదుపాయాలు, నాణ్యమైన భోజనం, భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img