epaper
Thursday, January 15, 2026
epaper

మేడారం జాతరకు సర్వం సిద్ధం

మేడారం జాతరకు సర్వం సిద్ధం
గిరిజన సంప్రదాయాలకు పెద్దపీట
3 కోట్ల మంది భక్తుల రాక అంచనా
సీఎం చేతుల మీదుగా వనదేవతల గద్దెల పునఃప్రారంభం
సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు

కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకతను చాటిచెప్పే విధంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా వనదేవతల గద్దెల పునఃప్రారంభం చేయనున్నట్లు సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాస రాజు తెలిపారు. గురువారం ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జనవరి 28 నుంచి జాతర

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, మేడారం జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవింద రాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుందని చెప్పారు. 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. 30వ తేదీన భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారని, 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజు వనదేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుందని వివరించారు. మేడారం జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, జాతర పరిసరాలను 8 జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌లో 8 మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. మొత్తం 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

రహదారులు–సిగ్నల్ ఏర్పాట్లు

భక్తులకు సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా 60 శాశ్వత సెల్ టవర్లు ఏర్పాటు చేసి కాల్ డ్రాప్, వీక్ సిగ్నల్ సమస్యలను నివారించేలా ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. రహదారుల విషయానికి వస్తే, 39 పాత రహదారులు, 10 కొత్త రహదారుల్లో మొత్తం 525 సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. పార్కింగ్ కోసం అటవీ శాఖ పరిధిలో 235 ఎకరాలు, పట్టా భూములు 250 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3 ఎకరాలు గుర్తించి, వాటి నిర్వహణ బాధ్యతలను అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు అప్పగించినట్లు తెలిపారు. వీఐపీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు పసర–తాడ్వాయి మార్గం ద్వారా మేడారానికి చేరుకుంటాయని, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు కాటారం–కల్వపల్లి మార్గం, హైదరాబాద్–వరంగల్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు పసర మార్గం ద్వారా చేరుకుంటాయని ఎస్పీ వివరించారు.

శాఖల సమన్వయం అవసరం

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు మాట్లాడుతూ, రహదారులు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు పార్కింగ్‌కు సంబంధించిన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ అభివృద్ధి చేయాలని సూచించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, ఈఈ వీరస్వామి, నేషనల్ హైవే, ఆర్&బీ, పీఆర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, డీపీఓ, ఎండోమెంట్, విద్యుత్, డీఎం అండ్ హెచ్‌ఓ, ఫైర్, ఎక్సైజ్, ఫిషరీస్, టూరిజం, డీడబ్ల్యూఓ, డీవీహెచ్‌ఓ, ఐటీడీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img