epaper
Thursday, January 15, 2026
epaper

పేదల ఓటుపై మోదీ కుట్ర

పేదల ఓటుపై మోదీ కుట్ర
రాజ్యాంగంపై కాషాయం పార్టీ దాడి
రాజ్యాంగ మార్పుకు బీజేపీ కుట్ర‌లు చేస్తోంది
ఓటు ప్రక్షాళన పేరుతో హక్కుల తొలగింపు
బీజేపీ వ్య‌తిరేక పోరాటాల‌కు సిద్ధ‌మ‌వ్వాలి
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే యత్నం
ములుగు సభకు సోనియా, రాహుల్, ప్రియాంక
గాంధీ భవన్ లో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశంలో పేదల హక్కులను కాలరాసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 80 శాతం మంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సభ్యులేనని గుర్తు చేశారు. చట్టసభల్లో బలం ఉందని చెప్పుకుని బీజేపీ ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. వెట్టి చాకిరిని నిర్మూలించి, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి, ఓటు హక్కు కల్పించింది మహాత్మా గాంధీ, డా. అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆ రాజ్యాంగాన్నే మార్చేందుకు బీజేపీ గత ఎన్నికల సమయంలో కుట్ర చేసిందని ఆరోపించారు.

రాజ్యాంగంపై బీజేపీ దాడి

గత ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటూ బీజేపీ బహిరంగంగా ప్రకటించిందని సీఎం గుర్తు చేశారు. ఆ ప్రమాదాన్ని గమనించిన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారని తెలిపారు. అదానీ, అంబానీకి దేశాన్ని అప్పగించే కుట్ర అమలుకాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని స్పష్టం చేశారు. ఓటు ప్రక్షాళన పేరుతో ‘సర్’ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చి పేదలు, మైనార్టీల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఓటు పోతే రేషన్ కార్డు, ఆధార్, సంక్షేమ పథకాలన్నీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో ఉండాలా? లేదా? అన్న నిర్ణయం బీజేపీ చేతిలో ఉండేలా కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.

ఉపాధి హామీపై కుట్ర

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల పేదల ఆత్మగౌరవం పెరిగిందని సీఎం తెలిపారు. ఈ పథకం ప్రారంభానికి, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికగా మారాయన్నారు. అయితే ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి, అంబానీ–అదానీ కంపెనీలకు తక్కువ వేతనాల కూలీలను సరఫరా చేయడానికే మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా కార్పొరేట్ కంపెనీలతో కలిసి చేసిన పన్నాగమని విమర్శించారు. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చిన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడారని, చివరకు రైతులకు మోదీ క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన వికసిత్ భారత్ నినాదం పేరులోనే గందరగోళం ఉందని, దేశంలో వికాసం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి పిలుపు

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశానికి మోదీ క్షమాపణ చెప్పే వరకూ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి, కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో, మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ప్రతి మండలానికి ఒక ఇంచార్జీ నియమిస్తామని, తాను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని చెప్పారు.

ములుగు సభకు సోనియా, రాహుల్, ప్రియాంక

ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, ములుగులో జరిగే సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తామని వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజే రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం సీట్లు గెలుచుకుందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు కార్యకర్తలను గెలిపించే బాధ్యత తమపై ఉందని సీఎం స్పష్టం చేశారు. గల్లీ గల్లీ కాదు… ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, కాంగ్రెస్‌కు తెలంగాణ ఎప్పుడూ అండగా నిలబడిందని తెలిపారు. దేశం ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అందుకు తెలంగాణ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తేల్చిచెప్పారు. మోదీని ఓడించి రాహుల్‌ను ప్రధాని చేయడానికి అందరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img