epaper
Sunday, March 1, 2026
epaper

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత!

దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత

ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిక

సాధారణ వైద్య పరీక్షల కోసమేనని డాక్టర్లు స్పష్టం

ఢిల్లీ కాలుష్యమే ఆరోగ్య సమస్యలకు కారణం

కాకతీయ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్న ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఛాతీ వైద్యుల పర్యవేక్షణలో పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా సాధారణ పరీక్షలలో భాగమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. సోనియాగాంధీ గత కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్నారని, ముఖ్యంగా ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగానే ఆమె తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె వయస్సు 79 సంవత్సరాలు కావడంతో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పార్లమెంటులోనే కాలుష్యంపై ఆవేదన

ఇదివరకే ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తుండటంపై సోనియాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాయు కాలుష్యంతో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మాస్కులు ధరించి ప్రకటనలు చేయడం కాకుండా, వాస్తవ చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో నిరసనలు తెలిపాయి. ఈ నిరసనల్లో సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు.

కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు

కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం గాలి నాణ్యత సూచిక (AQI) 101 నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మోస్తరుగా ఉన్నట్లు భావిస్తారు. 201 నుంచి 300 మధ్య ఉంటే ‘పేలవంగా’, 301 నుంచి 400 మధ్య ఉంటే ‘చాలా పేలవంగా’గా పరిగణిస్తారు. ఏక్యూఐ 400 దాటితే గాలి నాణ్యత తీవ్రంగా దిగజారినట్లే. 450 దాటితే అతితీవ్ర స్థాయి, 500 లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే అత్యంత ప్రమాదకర స్థాయిగా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలోనే రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం (PUC) లేని వాహనాలకు పెట్రోల్ స్టేషన్లలో ఇంధనం అందించకూడదని నిర్ణయించింది. అలాగే ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన బీఎస్-4 ప్రమాణాలు పాటించని వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను అమలు చేయడానికి ఢిల్లీ సరిహద్దుల్లో పోలీస్, రవాణా శాఖ ప్రత్యేక బృందాలను మోహరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img