epaper
Thursday, January 15, 2026
epaper

అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ

అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ
వెనుజులా సంపదపై కన్నేసిన ట్రంప్
ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
అమెరికన్ పెత్తందారితనానికి నిరసనగా వ‌రంగ‌ల్‌లో ర్యాలీ

కాకతీయ, వరంగల్ సిటీ : స్వతంత్ర దేశమైన వెనుజులాపై అమెరికా అత్యంత పాశవికంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను బంధించి న్యూయార్క్‌కు తరలించడం దారుణమని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ప్రపంచ శాంతి కోరుకునే ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వెనుజులాపై అమెరికా నియంతృత్వ దాడిని ఖండిస్తూ పార్టీ కార్యాలయం నుంచి హెడ్‌పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెనుజులా ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ నినాదాలు చేశారు.

సంపద కోసం దేశాలపై దాడులు
గాదగోని రవి మాట్లాడుతూ, లాటిన్ అమెరికా దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు అమెరికా నియంతృత్వ పద్ధతుల్లో దాడులు చేస్తూ ఆయా దేశాల సహజ సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెనుజులాలో లభించే చమురు, బంగారం వంటి వనరులపై కన్నేసి అకస్మాత్తుగా దాడి చేయడం ప్రజాస్వామ్యానికి, ప్రపంచ శాంతికి తీవ్ర ముప్పు అని అన్నారు. సోషలిస్టు భావాలతో సమానత్వం, స్వేచ్ఛ మార్గంలో వెనుజులా అభివృద్ధి చెందుతోందని, భారతదేశానికి కూడా సుమారు 10 శాతం చమురు సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. అలాంటి దేశంపై ట్రంప్ కుటిల నీతితో దాడి చేయడం అన్యాయమని విమర్శించారు. సామ్రాజ్యవాద అమెరికా పెత్తందారి పోకడల వల్ల ప్రపంచ శాంతి విచ్ఛిన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత ప్రభుత్వానికి డిమాండ్
ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ వెనుజులాకు అండగా నిలవాలని, మోడీ ప్రభుత్వం కూడా వెనుజులా ప్రజలను ఆదుకునే విధంగా స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి మాలోత్ సాగర్, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, కన్నం వెంకన్న, జిల్లా నాయకులు సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి, గణిపాక ఓదెలు, మహమ్మద్ మహబూబ్ బాషా, పరిమళ గోవర్ధన్, రాజు, ఎగ్గెని మల్లికార్జున్, మాలోత్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img