epaper
Thursday, January 15, 2026
epaper

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ‌

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ‌
పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్ దేవా, కీల‌క నేత రాజిరెడ్డి లొంగుబాటు
వారితో పాటు మొత్తం 20 మంది డీజీపీ ఎదుట స‌రెండ‌ర్‌
48 ఆయుధాలు, 2,206 రౌండ్ల అమోనియం స్వాధీనం
మిగ‌తా మావోయిస్టులు సైతం జ‌నంలోకి రావాలి
తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి పిలుపు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీపీఐ (మావోయిస్టు) సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల చివరి ప్రధాన కోటగా భావించిన పీఎల్‌జీఏ బెటాలియన్ పూర్తిగా కూలిపోయింది. పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్ **బడ్సే సుక్కా అలియాస్ దేవా (డీకే ఎస్‌జెడ్‌సీఎం)తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలక నేత కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేష్ (ఎస్‌సీఎం) సహా మొత్తం 20 మంది అండర్‌గ్రౌండ్ మావోయిస్టు కేడర్లు, 48 ఆయుధాలు, 2,206 రౌండ్ల అమ్యూనిషన్‌తో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా క్షీణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం టీఎస్‌సీలో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలి ఉన్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన కేడర్లు పీఎల్‌జీఏకి చెందిన ఆయుధ గోదాముల వివరాలను పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా
2 ఎల్‌ఎంజీలు, 8 ఏకే–47 రైఫిళ్లు, 10 ఇన్సాస్ రైఫిళ్లు, 8 ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఒక యూఎస్ మేడ్ కోల్ట్ రైఫిల్, ఒక ఇజ్రాయెల్ మేడ్ టావర్ రైఫిల్, 4 బీజీఎల్‌లు, 2 గ్రెనేడ్లు సహా మొత్తం 48 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.20.30 లక్షల నగదును కూడా సీజ్ చేశారు.

దాడుల వ్యూహ‌క‌ర్త‌.. బడ్సే దేవా
బడ్సే సుక్కా అలియాస్‌ దేవా సీపీఐ (మావోయిస్టు)లో రెండో అత్యంత కీలక గిరిజన నేతగా గుర్తింపు పొందాడు. జెరాం ఘాటి దాడి సహా అనేక ఘాతుకాలకు వ్యూహకర్తగా వ్యవహరించిన ఇతనిపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలు, ఎన్ఐఏ కలిసి రూ.75 లక్షల రివార్డు ప్రకటించాయి. 2025 అక్టోబర్ 21న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన శాంతి పిలుపుకు స్పందిస్తూ మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి ప్రజాజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగుబాటు సమయంలో తెలిపారు. అంతర్గత విభేదాలు, భద్రతా బలగాల నిరంతర ఒత్తిడి, లాజిస్టిక్ నెట్‌వర్క్ క్షీణత, కుటుంబాల నుంచి దూరం కావడం వంటి కారణాలతో ఉద్యమంపై నమ్మకం కోల్పోయినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన 20 మందికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం మొత్తం రూ.1.81 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. తాత్కాలికంగా ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున వెంటనే అందజేశారు.
ఈ చారిత్రక లొంగుబాటుకు కృషి చేసిన భద్రతా బలగాలను తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి ప్ర‌శంసించారు. ఇంకా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img