epaper
Monday, March 2, 2026
epaper

అసెంబ్లీకి దూరం… బయట రాజకీయం

అసెంబ్లీకి దూరం… బయట రాజకీయం
సమావేశాల బీఆర్ ఎస్ బ‌హిష్క‌రించ‌డంపై భిన్న వాద‌న‌లు
‘ఒక అంశాన్ని సాకుగా చూపి సభ బాయ్‌కాట్ ఎందుకు?’
అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన విషయాలు బయటే చర్చా?
కాంగ్రెస్–బీఆర్‌ఎస్ నేత‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు
నదీజలాలపై ఎవరి ప్రజెంటేషన్ వారిదే!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనసభ సమావేశాలను బీఆర్‌ఎస్ బహిష్కరించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్… సభలో వాకౌట్ చేసి పూర్తిస్థాయిలో బాయ్‌కాట్‌కు దిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ వాదన భిన్నంగా ఉంది. ఒకే అంశాన్ని సాకుగా చూపి మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మూసీ ప్రక్షాళన అంశంపై మైక్ ఇవ్వలేదన్న కారణాన్ని చూపిస్తూ సభకు దూరంగా ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక అంశంపై మాట్లాడనివ్వలేదని చెబుతూ… మిగతా ప్రజా సమస్యలపై ఎందుకు చర్చించకూడదని కాంగ్రెస్ నిలదీస్తోంది. బీఆర్‌ఎస్ లొసుగులు బయటపడతాయన్న భయంతోనే అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటోందని ఆరోపిస్తోంది.

నదీజలాలపై రెండు వేదికలు

కృష్ణా జలాల వాటాపై రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండనున్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ తరఫున హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో వేరు ప్రజెంటేషన్ ఇస్తారంటూ ప్రకటన చేశారు. నదీజలాల వంటి కీలక అంశంపై అసెంబ్లీ వేదికను వదిలేసి… ఎవరి వేదికల్లో వారు ప్రజెంటేషన్లు ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నదీజలాల అంశంపై రాజకీయ రగడ మొదలుపెట్టింది బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌నేనని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. అలాంటప్పుడు అదే అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించకుండా బయట రాజకీయాలు చేయడం ఏమిటని నిలదీస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ఆయనతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ సభకు రాకుండా బయట నుంచే పోరాటం చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తోంది.

‘సభలోనే ప్రశ్నించండి’

బయట ప్రశ్నించే అంశాలన్నింటినీ అసెంబ్లీలోనే ప్రశ్నిస్తే ప్రజలకు స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే సభలోనే నిలదీయాలని, అందుకు సిద్ధమేనని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. కానీ అసెంబ్లీకి రావడానికి బీఆర్‌ఎస్ సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్యగా మారిందని వ్యాఖ్యానిస్తోంది. మొత్తానికి నదీజలాల అంశంపై ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి మారింది. శాసనసభ వేదిక ఖాళీగానే ఉండగా… రాజకీయ పోరాటం మాత్రం బయట ముదురుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img