epaper
Thursday, January 15, 2026
epaper

‘బయటకు ఎలా పొక్కింది?’

‘బయటకు ఎలా పొక్కింది?’
ప్ర‌శాంతంగా అధికారి వ‌సూళ్ల‌పై ఆరా
కాకతీయ కథనంతో ఉలిక్కిపడ్డ విద్యుత్ శాఖ..!
అక్రమ వసూళ్ల వ్యవహారంపై శాఖలో కలకలం
కాంట్రాక్టర్ వర్గాల్లోనూ చ‌ర్చ‌.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందా..?

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలంలో వ్యవసాయ విద్యుత్ సదుపాయాల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ‘పొలం బాట’ పేరుతో రైతులపై భారం మోపుతూ ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై ‘కాకతీయ’లో కథనం ప్రచురితమైన వెంటనే శాఖలో అంతర్గతంగా పెద్ద చర్చ మొదలైంది. రైతుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారనే వార్తతో “ఎవరు తీసుకున్నారు..? ఎక్కడ తీసుకున్నారు..?” అన్న ప్రశ్నలు అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

రైతులనే గుచ్చి గుచ్చి ప్రశ్నలు

విశ్వసనీయ సమాచారం ప్రకారం… సదరు ఏఎల్ఎం స్థాయి ఉద్యోగి తనపై వచ్చిన ఆరోపణలతో తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రశాంతంగా ముడుపులు తీసుకుని వ్యవహారం ముగిసిందనుకున్న అతడు, కథనం వెలువడిన వెంటనే రైతులను స్వయంగా సంప్రదించి “మీరు ఎవరికి చెప్పారు..? ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారా..? ఈ విషయం బయటికి ఎలా వచ్చింది..?” అంటూ ఫోన్ కాల్స్‌, సందేశాల ద్వారా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసినట్టు సమాచారం. రైతులు ఈ ఒత్తిడితో మరింత భయాందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది.

కాంట్రాక్టర్ వర్గాల్లోనూ టెన్షన్

ఇదే సమయంలో ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతున్న కాంట్రాక్టర్ వర్గాల్లోనూ అశాంతి నెలకొంది. “మా పేరు ప్రస్తావించారా..? డబ్బుల వివరాలు బయటికి వెళ్లాయా..?” అన్న ఆందోళనతో కొందరు పరుగులు పెట్టినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. పై అధికారుల దృష్టికి వ్యవహారం చేరుతుందనే భయంతో సంబంధిత వర్గాలు పరిస్థితిని సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. కాకతీయ పత్రికలో కథనం వెలువడిన తర్వాత పలువురు ఉన్నతాధికారులు కూడా మంగపేట పరిణామాలపై ఆరా తీసినట్టు వినిపిస్తోంది. గతంలోనే అవినీతిపై కఠిన చర్యల హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఈ వ్యవహారాన్ని అధికారులు ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తిగా మారింది. రైతులకు నిజంగా న్యాయం జరుగుతుందా..? లేక వ్యవహారం మళ్లీ మామూలుగా మారిపోతుందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు మాత్రం తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాన్నే వ్యక్తిగత లాభాల సాధనంగా మార్చడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమ పరిస్థితిని బయటకు చెప్పుకోలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఉన్నతాధికారుల నిర్ణయాలపైనే నిలిచింది. మంగపేట అక్రమ వసూళ్ల వ్యవహారం ఎటు దారితీస్తుంది..? కఠిన చర్యల దిశగా అడుగులు పడతాయా..? లేక మళ్లీ మామూలేనా..? అన్నది వేచి చూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img