పదవీ విరమణ తర్వాత కుటుంబంతో సంతోషంగా గడపాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుధీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్.ఐలు జె. విల్సన్, పి. ప్రకాష్ రెడ్డి, ఆర్.ఎస్.ఐ కె. ప్రభాకర్, ఏఆర్ఎస్ఐలు అబ్దుల్ రఫీక్, ఎం. రవి ఉన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, పోలీస్ శాఖకు సుదీర్ఘకాలం సేవలందించిన పదవీ విరమణ అధికారులు నేటి తరం పోలీస్ సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వంతో నుంచి అందే పదవీ విరమణ ప్రయోజనాలను భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా భద్రపరుచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్ర, ఆర్.ఐ సతీష్, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ కుమార్తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


